News July 13, 2024
REWIND: సిక్కోలు మణిరత్నం చౌదరి సత్యనారాయణ (నేడు జయంతి)

ఎచ్చెర్ల మండలం ఎస్ఎం పురంలో 1908 జులై 13న జన్మించిన చౌదరి సత్యనారాయణ స్వాతంత్ర్య సమరయోధుడు. 13 ఏళ్ల వయసులోనే ఉప్పు సత్యాగ్రహం, కల్లు వేలం పాటలకు వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో దూసి పోలీస్ స్టేషన్కు వచ్చిన మహాత్మా గాంధీని పొందూరు ఖాదీతో సత్కరించారు. 1955, 1967లో కృషికార్ లోక్ పార్టీ, స్వతంత్ర పార్టీ తరఫున ఎమ్మెల్యే అయ్యారు.
Similar News
News July 11, 2025
శ్రీకాకుళం జిల్లా టుడే టాప్ న్యూస్ ఇవే

✯ మెళియాపుట్టి: విద్యుత్ షాక్ తో 5వ తరగతి విద్యార్థి మృతి
✯మందసలో అధికారులను అడ్డుకున్న రైతులు
✯ విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే రవికుమార్
✯ సారవకోట: లారీని ఢీకొన్న ఆటో.. ఐదుగురికి తీవ్ర గాయాలు
✯ కళింగపట్నంలో పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
✯ పలాస: గంజాయితో ముగ్గురు అరెస్ట్
✯ కంచిలి: అధ్వానంగా ఆసుపత్రి పరిసరాలు
✯ టెక్కలి: శాకాంబరీదేవిగా శివదుర్గ అమ్మవారు
News July 10, 2025
మెళియాపుట్టి: విద్యుత్ షాక్తో విద్యార్థి మృతి

మెళియాపుట్టి మండలం గొప్పిలిలో గురువారం సాయంత్రం విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన 5వ తరగతి విద్యార్థి మహేష్ (9) తన ఇంటి మేడపై మొక్కను నాటేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగిలి షాక్కు గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. విగతజీవిగా పడిన ఉన్న బాలుడుని కుటుంబీకులు ఆస్పుత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు చెప్పారు.
News July 10, 2025
కళింగపట్నంలో నిర్మాణ పనులను పరిశీలించిన రామ్మెాహన్

ఎత్తిపోతల పథకం పనులు త్వరగతిన పూర్తి చేయాలని కేంద్ర పౌరవిమానాయన శాఖమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. వంశధార నదిలో నిర్మాణం జరుగుతున్న కళింగపట్నం వమరవెల్లి ఎత్తిపోతల పథకం పనులను గురువారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ పథకంతో ఎంతోమంది రైతులకు ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటి వరకు జరిగిన పనులు స్థితిగతులను ఎమ్మెల్యే గొండు శంకర్ను అడిగి తెలుసుకున్నారు.