News December 27, 2024
REWIND: హైదరాబాదీల మనసు గెలిచారు..

మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ నిన్న రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. HYD విశ్వనగరంగా అభివృద్ధి చెందడంలో ఆయన సహకారం కీలకంగా ఉంది. కాగా.. 2013లో దిల్సుఖ్నగర్లోని కోణార్క్, వెంకటాద్రి థియేటర్ల వద్ద జరిగిన బాంబ్ బ్లాస్ట్లు దేశాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ఆ సమయంలో ప్రధానిగా ఉన్న ఆయన ఇక్కడ పర్యటించి ‘భయపడకండి’ అని బాధితులు, నగరవాసులకు ధైర్యం కల్పించారు. ఈ పర్యటనతో ఆయన హైదరాబాదీల మనసు గెలుచుకున్నారు.
Similar News
News October 23, 2025
జూబ్లీహిల్స్ బైపోల్లో నో బ్యాలెట్.. ఓన్లీ EVM!

EVMల ద్వారానే జూబ్లీహిల్స్ బైపోల్ నిర్వహిస్తామని HYD జిల్లా ఎన్నికల అధికారి RV కర్ణన్ స్పష్టం చేశారు. నామినేషన్ల పరిశీలన పూర్తి చేసిన అనంతరం 81 మంది అభ్యర్థులకు ఆమోదం లభించింది. రేపు ఉపసంహరణకు అవకాశం ఉంది. ఇంకెవరైనా ఉపసంహరణకు వెళితే అభ్యర్థుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. అయితే, 64 మందికి పైగా పోటీలో ఉంటే M3 ఈవీఎంలు ఉపయోగించనున్నారు.
News October 23, 2025
సికింద్రాబాద్: ప్రయాణికులతో ‘పరిచయ కార్యక్రమం’

తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి ఆదేశాల మేరకు ఆర్టీసీలో పని చేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులతో పరిచయ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. డీఎం సరితా దేవి ఆదేశంతో ఈరోజు కండక్టర్, వీబీఓ గోపు శ్రీనివాస్ సికింద్రాబాద్ టు వర్గల్ బస్ ప్రయాణికులతో పరిచయం చేసుకున్నారు. రూట్ వివరాలు, సమయ పట్టిక, ఆర్టీసీ ఆఫర్స్, సేవలు, సోషల్ మీడియా, సైట్లపై వివరించారు.
News October 23, 2025
పోచారంలో కాల్పులు.. CP క్లారిటీ

పోచారంలో కాల్పుల ఘటనపై రాచకొండ CP సుధీర్ బాబు క్లారిటీ ఇచ్చారు. పాతకక్షల కారణంగా జరిగిన దాడి అంటూ స్పష్టం చేశారు. ‘ప్రశాంత్ చెప్పిన ప్లేస్ అయిన టీ స్టాల్ వద్దకు ఇబ్రహీం, మోసిన్, శ్రీనివాస్ వచ్చారు. ఇంతకుముందే వీళ్లకు ఇంటరాక్షన్ ఉంది. ఇబ్రహీంకు ప్రశాంత్ వల్ల రూ.కోటి నష్టం జరిగింది. ఇదే బుధవారం సాయంత్రం కాల్పులకు దారి తీసింది. నిందితులను అరెస్ట్ చేశాం. ఒకరు పరారీలో ఉన్నారు’ అని CP తెలిపారు.