News December 26, 2024
REWIND: కృష్ణా జిల్లాలో పెను విషాదానికి 20 ఏళ్లు

ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలకు 2004 సంవత్సరం పీడకలను మిగిల్చింది. పెను విధ్వంసంలో 27 మంది అసువులు బాసారు. సరిగ్గా నేటికి ఆ విషాద విపత్తు సంభవించి 20 ఏళ్లు. సునామీ సృష్టించిన భీభత్స అలల కారణంగా మంగినపూడి బీచ్ చూడటానికి వచ్చిన 27 మంది మరణించగా, వందల మంది గాయపడ్డారు. 4 మండలాలను సునామీ ముంచేయగా రూ.కోట్లల్లో ఆస్తి నష్టం వాటిల్లింది. ఎన్నో కుటుంబాలు నీట మునగ్గా, మరికొన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
Similar News
News September 13, 2025
కృష్ణాజిల్లా ఎస్పీగా విద్యాసాగర్ నాయుడు

కృష్ణ జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో విద్యాసాగర్ నాయుడును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాసాగర్ నాయుడు ప్రస్తుతం అన్నమయ్య జిల్లా ఎస్పీగా పని చేస్తున్నారు.
News September 13, 2025
గన్నవరంలో రగ్బీ జిల్లా జట్ల ఎంపికలు

కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో సెప్టెంబర్ 15న గన్నవరంలోని ప్రభుత్వ పాఠశాల క్రీడా మైదానంలో అండర్-14, అండర్-17 బాల బాలికల రగ్బీ జిల్లా జట్ల ఎంపికలు జరగనున్నాయి. ఈ ఎంపికలకు హాజరయ్యే క్రీడా కారులు స్టడీ సర్టిఫికెట్, జనన ధృవీకరణ పత్రం, అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయుల సీల్ ఉన్న ఎంట్రీ ఫారంతో రావాలని ఎస్జీఎఫ్ కార్యదర్శులు అరుణ, రాంబాబు తెలిపారు. ఎంపికలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయి.
News September 13, 2025
ఈ నెల 15 నుంచి గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు

జిల్లా పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ డీ.కే. బాలాజీ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. పశుసంపదను రక్షించేందుకు ప్రతి రైతు ఈ టీకా కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన సూచించారు.