News September 27, 2024
Rewind: మూసీ వరదలకు 116 ఏళ్లు!

HYD చరిత్రలో మూసీ వరదలు చెదరని ముద్ర వేశాయి. 1908 సెప్టెంబర్ 27 తెల్లవారుజామున క్లౌడ్ బరస్ట్ అయ్యింది. దాదాపు 36 గంటల పాటు భారీ వర్షం, వరదలు ముంచెత్తాయి. 28న మూసీ ఉగ్రరూపం దాల్చింది. వరదల్లో 50 వేల మంది నిరాశ్రయులు అయ్యారు. 15 వేల మంది చనిపోయినట్లు నాటి నిజాం పేర్కొన్నారు. ఇలాంటి విపత్తులు మరోసారి తలెత్తకుండా ఉస్మాన్ అలీఖాన్ ఆధ్వర్యంలో ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జంటజలాశయాలను నిర్మించారు.
Similar News
News November 11, 2025
FINAL UPDATE: జూబ్లీహిల్స్లో 48.43% పోలింగ్ నమోదు

నాయకులను ఎన్నుకోవడంలో హైదరాబాదీలు వెనకడుగు వేస్తున్నారని మరోసారి నిరూపించారు. సెలవు ఇచ్చి రండి బాబు ఓటింగ్కు అంటే జూబ్లీహిల్స్లో ఆమడ దూరం పోయారు. కొందరు ఉచిత ఆటోలు పెట్టారు. వాలంటీర్లు సేవ చేశారు. మొబైల్ భద్రపరిచేందుకు కౌంటర్లు ఏర్పాటు చేశారు. గంటసేపు ఓటింగ్ పెంచారు. అయినా సగానికి పైగా ఓటెయ్యలేదు. దేశంలో 8 స్థానాలకు ఉప ఎన్నిక జరగగా అత్యల్పంగా జూబ్లీలోనే ఓటింగ్ 48.43% నమోదు కావడం గమనార్హం.
News November 11, 2025
బేగంపేట్ సీఎం ప్రజావాణికి 132 దరఖాస్తులు

బేగంపేట్ ప్రజాభవన్లో మంగళవారం నిర్వహించిన సీఎం ప్రజావాణికి 132 దరఖాస్తులు వచ్చాయి. గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి 41, రెవెన్యూశాఖ 29, హోంశాఖకు10, ఇందిరమ్మ ఇళ్ల కోసం 31, ప్రవాసి ప్రజావాణికి 2 దరఖాస్తులు రాగా.. ఇతర శాఖలకు సంబంధించి 19 దరఖాస్తులు అందినట్లు సీఎం ప్రజావాణి ఇన్ఛార్జ్ చిన్నారెడ్డి తెలిపారు. పలు దరఖాస్తులపై వెంటనే ఫోన్లో మాట్లాడి పరిష్కరించామన్నారు.
News November 11, 2025
HYD: సీఎం ప్రజావాణిని సందర్శించిన అధికారులు

సీఎం ప్రజావాణిని రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన వివిధ శాఖల అధికారుల బృందం మంగళవారం సందర్శించింది. ఈ సందర్భంగా సీఎం ప్రజావాణి పనితీరును వారు క్షుణ్ణంగా పరిశీలించారు. ఇందులో సమస్యల పరిష్కారంలో అమలు చేస్తున్న తీరును స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతామని పాల్గొన్న అధికారులు తెలిపారు. సమస్యల పరిష్కారంలో అనుసరిస్తున్న వైఖరిని అధికారులు ప్రజావాణి ఇన్ఛార్జ్ చిన్నారెడ్డిని అడిగి తెలుసుకున్నారు.


