News April 12, 2025
REWIND: వనజీవి రామయ్యకు యాక్సిడెంట్.. ఏం చేశారంటే..

రెండేళ్ల క్రితం తన ఇంటి ఎదుట రోడ్డు దాటుతుండగా వనజీవి రాయమ్యను ఓ వ్యక్తి బైక్తో ఢీకొట్టాడు. అయితే ప్రమాదానికి కారకుడైన వ్యక్తికి రామయ్య అరుదైన శిక్ష విధించారు. అతడిని క్షమించి కేసు పెట్టకుండా 100 మొక్కలను నాటాలని సూచించారు. దీంతో పోలీసులు సదరు వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ ఒక్క సంఘటన చాలదా వనజీవికి ప్రకృతి అంటే ఎంత ప్రేమో..!
Similar News
News December 15, 2025
శ్రీకాకుళం జిల్లా మార్పుపై డిమాండ్

పలాసను కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్పై అన్ని పార్టీ నాయకులు కలిసికట్టుగా సహకరించాలని మాజీ కేంద్రమంత్రి కిల్లి.కృపారాణి పేర్కొన్నారు. ఆదివారం టెక్కలిలోని ఆమె కార్యాలయంలో పలాస జిల్లా సాధన కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. కొత్తగా పలాస జిల్లా ఏర్పడితే మొట్టమొదటిగా లాభపడేది ఇచ్ఛాపురం నియోజకవర్గమేనని, వారి సహకారం అవసరమన్నారు. పలాసను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
News December 15, 2025
రబీ సాగు నిరాశాజనకం

APలో రబీ సాగు ఆశించినస్థాయిలో సాగడం లేదు. ఈ సీజన్లో 20.70 లక్షల హెక్టార్లలో 22 రకాల పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేయగా ఇప్పటి వరకు 6.57 లక్షల హెక్టార్లలో మాత్రమే రైతులు పంటలు వేశారు. మొంథా, దిత్వా తుఫాన్ల కారణంగా ఖరీఫ్ పంటల కోతలు ఆలస్యమవడం ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. కృష్ణా డెల్టా, సాగర్ కుడి కాలువ కింద వరి సాగుకు నీటి గ్యారంటీ లేకపోవడమూ మరో కారణమని పేర్కొంటున్నారు.
News December 15, 2025
HYD: న్యూ ఇయర్ కోసం వెయిటింగా? మీకోసమే

HYD న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. DEC 31 అర్ధరాత్రి నుంచి జనవరి 1 వరకు పబ్లు, బార్లు, హోటళ్లలో CCకెమెరాలు, సెక్యూరిటీ తప్పనిసరి. మైనర్లకు ఎంట్రీ, మద్యం నిషేధం, డీజేలు, అశ్లీల నృత్యాలు, రాత్రి 10 తర్వాత లౌడ్ స్పీకర్లు బ్యాన్. మద్యం తాగి వాహనం నడిపితే కేసులు, జరిమానా, జైలు శిక్ష విధిస్తామని CP సజ్జనార్ హెచ్చరించారు. న్యూ ఇయర్ ఈవెంట్లు రాత్రి 12:30లోపు ముగించాలన్నారు.


