News December 27, 2024

REWIND: హైదరాబాదీల మనసు గెలిచారు..

image

మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ నిన్న రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. HYD విశ్వనగరంగా అభివృద్ధి చెందడంలో ఆయన సహకారం కీలకంగా ఉంది. కాగా.. 2013లో దిల్‌సుఖ్‌నగర్‌లోని కోణార్క్, వెంకటాద్రి థియేటర్‌ల వద్ద జరిగిన బాంబ్ బ్లాస్ట్‌లు దేశాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ఆ సమయంలో ప్రధానిగా ఉన్న ఆయన ఇక్కడ పర్యటించి ‘భయపడకండి’ అని బాధితులు, నగరవాసులకు ధైర్యం కల్పించారు. ఈ పర్యటనతో ఆయన హైదరాబాదీల మనసు గెలుచుకున్నారు.

Similar News

News December 28, 2024

VKB: జిల్లాలో నేటి ముఖ్యంశాలు!!

image

✔మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించిన సీఎం, జిల్లా నేతలు✔పూడూరు: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని వ్యక్తి మృతి✔GREAT: రగ్బీ రాష్ట్ర జట్టుకు కోస్గి విద్యార్థి✔VKD:మహిళ మెడలోంచి బంగారం చోరీ✔VKB:మన్మోహన్‌సింగ్‌కు సర్వశిక్షా ఉద్యోగల నివాళి✔VKB:మాస్టర్ ప్లాన్ డ్రోన్ సర్వే REPORT విడుదల✔యాలాల్‌: జాతరకు వచ్చిన భక్తులపై కుక్కల దాడి✔ కొడంగల్:వానరానికి ఘనంగా అంత్యక్రియలు

News December 27, 2024

HYD: మంద జగన్నాథానికి మంత్రి పరామర్శ

image

నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ మంద జగన్నాథాన్ని HYD ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. ఈ సందర్భంగా నిమ్స్ ఆసుపత్రి సూపరింటెండెంట్ బీరప్ప, వైద్యులతో ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయనకు మెరుగైన చికిత్సను అందించాలని మంత్రి వైద్యులను కోరారు.

News December 27, 2024

HYD: వారం రోజులు సంతాప దినాలు: TPCC

image

మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో వారం రోజులపాటు సంతాప దినాలుగా పాటించనున్నట్లు పేర్కొన్నారు. రేపటి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలతో పాటు జనవరి 3 వరకు అన్ని రాజకీయ కార్యక్రమాలు రద్దు చేయనున్నట్లు తెలిపారు.