News December 27, 2024

REWIND: హైదరాబాదీల మనసు గెలిచారు..

image

మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ నిన్న రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. HYD విశ్వనగరంగా అభివృద్ధి చెందడంలో ఆయన సహకారం కీలకంగా ఉంది. కాగా.. 2013లో దిల్‌సుఖ్‌నగర్‌లోని కోణార్క్, వెంకటాద్రి థియేటర్‌ల వద్ద జరిగిన బాంబ్ బ్లాస్ట్‌లు దేశాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ఆ సమయంలో ప్రధానిగా ఉన్న ఆయన ఇక్కడ పర్యటించి ‘భయపడకండి’ అని బాధితులు, నగరవాసులకు ధైర్యం కల్పించారు. ఈ పర్యటనతో ఆయన హైదరాబాదీల మనసు గెలుచుకున్నారు.

Similar News

News November 9, 2025

నవీన్ యాదవ్ రౌడీ కాదు: CM రేవంత్

image

నవీన్ యాదవ్ రౌడీ కాదని CM రేవంత్ రెడ్డి అన్నారు. B.Arch చేసి, ప్రజా సేవలో ఉన్న యువకుడు నవీన్ అంటూ CM పేర్కొన్నారు. ‘తన తండ్రిని చూసి రౌడీ అన్ని ముద్ర వేస్తున్నట్లు నవీన్ యాదవ్ ఇప్పటికే చెప్పారు. పాస్‌పోర్టు బ్రోకర్ కొడుకు ఏం అవుతారని కూడా ఆయన నిలదీశారు. దీనిపై BRS సమాధానం చెప్పాలి. టికెట్ ఇచ్చిన అని నేను ఏం చెప్పడం లేదు. నవంబర్ 14న జూబ్లీహిల్స్ ప్రజలే తీర్పు చెబుతారు’ అని CM రేవంత్ తెలిపారు.

News November 9, 2025

HYD: తండ్రి మరణం తట్టుకోలేక యువతి సూసైడ్

image

నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. తండ్రి మరణాన్ని తట్టుకోలేక సౌమ్య అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది.బ్లాక్ నంబర్–4 అపార్ట్‌మెంట్స్‌లోని మూడో అంతస్తు నుంచి దూకిన ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా ప్రాణాలు నిలువలేదు. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 9, 2025

జూబ్లీహిల్స్‌లో 100 శాతం గెలుపు కాంగ్రెస్‌దే: CM

image

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ 100 శాతం గెలుస్తుందని CM రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. BRSకు ఓటమి తప్పదని ఆయన జోస్యం చెప్పారు. ఇక BJPకి డిపాజిక్ కూడా దక్కదన్నారు. ఆదివారం మీట్‌ ద ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. BJPకి డిపాజిట్ రాదన్న విషయం కిషన్ రెడ్డి గుర్తించాలన్నారు. నవంబర్ 14న ఫలితాలు వచ్చాక చూద్దామంటూ CM వ్యాఖ్యానించారు. ఇక బస్తీల సమస్యలపై మంత్రులకు బాధ్యతలు అప్పగించినట్లు ఆయన తెలిపారు.