News May 16, 2024
REWIND-2019: పెద్దపల్లిలో BRSకి 95,180 ఓట్ల మెజార్టీ!
పెద్దపల్లిలో విజయం ఎవరిదనేది హాట్ టాపిక్గా మారింది. 2019లోనూ రసవత్తర పోరు సాగింది. చంద్రశేఖర్(కాంగ్రెస్)పై వెంకటేశ్ నేతగాని(BRS) 95,180 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. S.కుమార్ (BJP) 3వ స్థానంలో నిలిచారు. అయితే 2024లో గడ్డం వంశీకృష్ణ (కాంగ్రెస్), గోమాస శ్రీనివాస్ (BJP), కొప్పుల ఈశ్వర్ (BRS) నువ్వానేనా అన్నట్లు ప్రచారం చేశారు. పోలింగ్ ముగిశాక ఎవరికి వారు మాదే మెజార్టీ అంటున్నారు. మీ కామెంట్?
Similar News
News October 6, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ జగిత్యాల, సిరిసిల్ల కలెక్టరేట్లో వైభవంగా బతుకమ్మ సంబరాలు.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాక జయంతి వేడుకలు.
@ కథలాపూర్ మండలంలో హత్యకు పాల్పడిన నిందితుడి అరెస్ట్.
@ కొండగట్టులో 100 గదుల నిర్మాణానికి స్థల పరిశీలన.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వైభవంగా కొనసాగుతున్న దుర్గా నవరాత్రి ఉత్సవాలు.
@ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కనును కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్.
News October 5, 2024
హుజూరాబాద్లో దారుణ హత్య
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని రాజపల్లెలో వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. రాజు అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు తలపై కొట్టి చంపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 5, 2024
కోరుట్ల ఎస్సై- 2 శ్వేతను సస్పెండ్ చేసిన ఐజీ
జగిత్యాల జిల్లాలో కోరుట్ల పోలీస్స్టేషన్లో ఎస్సై-2 గా పనిచేసిన శ్వేతను సస్పెండ్ చేస్తూ మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్ ఉత్తర్వులు జారీచేశారు. జగిత్యాల పట్టణానికి చెందిన శివకుమార్ అనే వ్యక్తిపై గత నెల29న ఎస్సై శ్వేత చేయిచేసుకున్నారని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై పోలీస్శాఖ అధికారులు విచారణ చేపట్టారు. నివేదిక ఆధారంగా ఎస్సై-2 శ్వేతను సస్పెండ్ చేసినట్లు ఐజీ ప్రకటన జారీ చేశారు.