News October 8, 2024

REWIND: మరణంలోనూ వీడని అక్కాచెల్లెళ్ల బంధం

image

ఇజ్రాయెల్‌ పైకి హమాస్‌ దాడి చేసి ఏడాది పూర్తయింది. ఈదాడిలో ఇద్దరు అక్కాచెల్లెలు మరణించిన ఘటనను గుర్తుచేస్తూ ‘ఇజ్రాయెల్’ ట్వీట్ చేసింది. ‘ఇద్దరు అక్కాచెల్లెళ్లకు సంబంధించిన కథ ఇది. వీరిద్దరూ కలిసి జీవిస్తూ, కలిసి నృత్యం చేస్తూ, కలిసి మరణించారు. ఓ మ్యూజికల్ ఫెస్టివల్‌పై హమాస్ జరిపిన దాడిలో ఇద్దరు సోదరీమణులు దుర్మరణం చెందారు. జీవితంలో ఎప్పటికీ విడిపోని వీరు మరణంలోనూ కలిసే ఉన్నారు’ అని పేర్కొంది.

Similar News

News December 13, 2025

NIT ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలు

image

<>నేషనల్ <<>>ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఏపీ 2 ల్యాబ్ ట్రైనీ పోస్టులను ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనుంది. డిప్లొమా(సివిల్ ఇంజినీరింగ్), బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు డిసెంబర్ 18న ఉదయం 9.30గంటలకు ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. ఎంపికైనవారికి నెలకు జీతం రూ.18,000-రూ.22,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://nitandhra.ac.in/

News December 13, 2025

ఈ వాతావరణం కనకాంబరం సాగుకు అనుకూలం

image

అధిక తేమ, వేడి కలిగిన ప్రాంతాలు కనకాంబరం సాగుకు అనుకూలం. మొక్క పెరుగుదలకు 30 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉండాలి. చల్లని వాతావరణ పరిస్థితుల్లో పూల దిగుబడి అధికంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువగా ఉంటే పూలు లేత రంగుకు మారి నాణ్యత తగ్గుతుంది. మరీ తక్కువ ఉష్ణోగ్రతను కూడా మొక్క తట్టుకోలేదు. నీరు నిలవని అన్ని రకాల నేలలు, ఉదజని సూచిక 6 నుంచి 7.5 మధ్య ఉన్న నేలల్లో మంచి దిగుబడి వస్తుంది.

News December 13, 2025

కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

image

AP: కేంద్ర మాజీ మంత్రి కుసుమ కృష్ణమూర్తి(85) గుండెపోటుతో ఢిల్లీలో కన్నుమూశారు. దీంతో కాంగ్రెస్ నేతలు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కృష్ణమూర్తి అమలాపురం నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచారు. పెట్రోలియం&కెమికల్స్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. INC జాయింట్ సెక్రటరీగానూ పనిచేశారు.