News March 30, 2024

REWIND: నాడు 355 ఓట్ల మెజార్టీతో గన్నవరం ఎమ్మెల్యే

image

గన్నవరం నియోజకవర్గానికి ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరగ్గా.. 355 ఓట్ల మెజార్టీ అత్యల్పం. 1972లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన టి.ఎస్.ఆనందబాయి ఇంత తక్కువ మెజార్టీతో ఎమ్మెల్యే అయ్యారు. ఇదే నియోజకవర్గంలో 1989లో 715 ఓట్లు, 1955లో 823 ఓట్లు, 2019లో 838 ఓట్ల మెజార్టీతో ముసునూరు రత్నబోస్, పి. సుందరయ్య, వల్లభనేని వంశీ ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఈసారి గన్నవరంలో వంశీ, యార్లగడ్డ వెంకట్రావు తలపడుతున్నారు.

Similar News

News September 29, 2024

పేకాట స్థావరాలపై దాడులు చేస్తున్నాం: కృష్ణా జిల్లా పోలీసులు

image

కృష్ణా జిల్లా పరిధిలోని పలు ప్రాంతాలలో ఆదివారం విస్తృత తనిఖీలు నిర్వహించి పేకాట స్థావరాలపై దాడులు చేశామని జిల్లా పోలీస్ యంత్రాంగం తమ అధికారిక ట్విటర్(X) ఖాతాలో పోస్ట్ చేసింది. జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలకు తావు లేకుండా పటిష్ఠ చర్యలు చేపడుతూ.. పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించి నగదు స్వాధీనం చేసుకుని పట్టుబడ్డవారిపై కేసులు నమోదు చేస్తున్నామని తెలిపింది.

News September 29, 2024

పులిగడ్డ-పెనుముడి వారధిపై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

అవనిగడ్డ నియోజకవర్గం పులిగడ్డ-పెనుమూడి వారిధిపై ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు ప్రకారం.. రేపల్లె నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు, ఎదురుగా వస్తున్న బొలెరో వ్యాన్‌ను ఢీకొనడంతో సంఘటనా స్థలంలోనే ఇద్దరు మృతిచెందారు. ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 29, 2024

రేపు విజయవాడకు రానున్న సినీ హీరో కార్తీ

image

విజయవాడ నగరానికి సినీ హీరో కార్తీ సోమవారం రానున్నారు. ఇటీవల సత్యం సుందరం సినిమా విడుదలై విజయవంతం కావడంతో సినీ హీరో విజయవాడకు రానున్నట్లు సమాచారం. ఉదయం 10గంటలకు దుర్గగుడిలో అమ్మవారిని దర్శించుకుంటారు. 12 గంటలకు ప్రైవేట్ హోటల్లో విలేకరుల సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 5గంటలకు క్యాపిటల్ సినిమా ఆవరణంలో నగర ప్రజలతో కలిసి సందడి చేస్తారని సినీ యూనిట్ సభ్యులు తెలిపారు.