News August 17, 2024

భద్రత లేదంటూ గవర్నర్‌కు RG కర్ వైద్యుల వేడుకోలు

image

RG కర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో దుర్మార్గాలు జరుగుతున్నాయని అక్కడి వైద్యులు బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్‌కు వివరించారు. తమ భద్రతపై 30-35 మందితో కూడిన బృందం ఆయన వద్ద ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరింది. బుధవారం రాత్రి విధ్వంసం జరిగాక తాము సురక్షితంగా లేమన్న భావన కలుగుతోందని ఆవేదన చెందింది. సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని గవర్నర్ వారికి హమీ ఇచ్చారు.

Similar News

News November 25, 2025

సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549

image

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. బవుమా సేన 5 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. స్టబ్స్ 94 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

News November 25, 2025

సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549

image

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. బవుమా సేన 5 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. స్టబ్స్ 94 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

News November 25, 2025

భర్తపై గృహ హింస కేసు పెట్టిన నటి

image

బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన భర్త పీటర్ హాగ్‌పై గృహహింస కేసు పెట్టారు. ఆయన నుంచి రూ.50Cr నష్టపరిహారం ఇప్పించాలన్నారు. నెలకు తనకు రూ.10 లక్షలు మెయింటెనెన్స్ చెల్లించేలా ఆదేశించాలని ముంబై కోర్టును కోరారు. అంతేకాకుండా ముంబైలోని తన నివాసంలోకి హాగ్‌ను ప్రవేశించకుండా ముగ్గురు పిల్లలను తానే చూసుకునే అనుమతివ్వాలన్నారు. దీంతో కోర్టు హాగ్‌కు నోటీసులు జారీ చేసింది. జైట్లీ, హాగ్ 2011లో పెళ్లి చేసుకున్నారు.