News April 6, 2025
RGM: ‘ఈ ఏడాది నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి సాధించాలి’

ఈ ఆర్థిక సంవత్సరం నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి- ఉత్పాదకత, ఓబి రిమూవింగ్, రవాణా నిర్విరామంగా కొనసాగాలని సింగరేణి సంస్థ డైరెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. రామగుండం సింగరేణి GM ఆసిఫ్ అలీ అన్ని విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. రక్షణతో కూడిన ఉత్పత్తి చేయాలన్నారు. అధికారులు గోపాల్ సింగ్, చంద్రశేఖర్, వెంకటేశ్వరరావు, ఆంజనేయులు, శివ నారాయణ, చిలుక శ్రీనివాస్, రమేశ్ ఉన్నారు.
Similar News
News April 17, 2025
HNK: మొదలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తరగతులు!

HNK జిల్లా ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ తరగతుల్లో భాగంగా పాఠశాల విద్యార్థులకు AI ద్వారా గణితం, సైన్స్, ఆంగ్ల భాషల్లో ఇంకా మంచి విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. శిక్షణ తరగతులు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
News April 17, 2025
పరిశ్రమలపై నాగర్కర్నూల్ ఎంపీ చర్చ

చెన్నైలోని పరిశ్రమలపై స్టాండింగ్ కమిటీలో తెలంగాణ రాష్ట్ర ఎంపీల ఫోరం రాష్ట్ర కన్వీనర్, NGKL ఎంపీ డాక్టర్ మల్లు రవి MSME, బ్యాంకులు, టాటా, ఓలా, బజాజ్, ఇతర ప్రముఖ పరిశ్రమలతో చర్చించారు. పార్లమెంట్ పరిధిలో నిరుద్యోగ వ్యవస్థపై దృష్టి పెడుతూ, అక్కడి యువతకు పరిశ్రమల స్థాపన, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించే ప్రణాళికలను ప్రతిపాదించారు.
News April 17, 2025
కాసేపట్లో వర్షం

తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న మూడు గంటల్లో వర్షం కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కామారెడ్డి, మహబూబ్నగర్, మెదక్, నాగర్కర్నూల్, నారాయణపేట, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వాన పడనున్నట్లు పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా నిన్న కూడా పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురిశాయి.