News October 24, 2025
RGM: అలా చేస్తే.. ఆస్తి పన్నులో 10% డిస్కౌంట్..!

రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్, అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) J.అరుణశ్రీ గురువారం నిర్వహించిన సమావేశంలో ఇంటింటా ఇంకుడు గుంతలు నిర్మించేందుకు ప్రజల్లో చైతన్యం పెంచాలని ఆదేశించారు. జలశక్తి అభియాన్లో డిసెంబర్ 31 నాటికి 10వేల గుంతలు నిర్మించడం లక్ష్యమన్నారు. ఇంటి యజమానులు స్వయంగా గుంత నిర్మిస్తే ఆస్తి పన్నులో 10% రాయితీ లభిస్తుందన్నారు. నల్లా కనెక్షన్ వివరాలు అమృతం యాప్లో నమోదు చేయాలని సూచించారు.
Similar News
News October 24, 2025
నేటి నుంచి టెట్ దరఖాస్తులు!

AP: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహణకు నేటి నుంచి అప్లికేషన్లు స్వీకరించనున్నారు. నవంబర్ 23 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఈ మేరకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుందని టెట్ కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు. డిసెంబర్ 3 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 10న 9.30am-12pm వరకు సెషన్-1, 2.30-5pm వరకు సెషన్-2 పరీక్ష జరగనుంది. జనవరి 19న ఫలితాలు వెలువడనున్నాయి.
వెబ్సైట్: <
News October 24, 2025
1999 నుంచి జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు

గుంటూరు జిల్లా పోలియో రహితంగా కొనసాగుతోంది. 1999 నుంచి ఇప్పటి వరకు ఎటువంటి పోలియో కేసులు నమోదు కాలేదు. భారతదేశం 2014లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చేత పోలియో ఫ్రీ దేశంగా గుర్తించబడింది. జిల్లాల విభజనకు ముందు సంవత్సరం 4,47,889 మందికి పోలియో చుక్కలు వేశారు. కాగా మన ఉమ్మడి జిల్లాలో 1999లో చిలకలూరిపేటలో చివరి కేసు నమోదయింది. అధికారులు పోలియోపై విస్తృత ప్రచారం చేస్తున్నారు. నేడు ప్రపంచ పోలియో దినోత్సవం.
News October 24, 2025
జేసీ వ్యాఖ్యలను ఖండించిన అనంతపురం రేంజ్ డీఐజీ

తాడిపత్రి ASP రోహిత్ కుమార్ చౌదరిపై మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను అనంతపురం రేంజ్ DIG షేమోషీ తీవ్రంగా ఖండించారు. గురువారం తన కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. ఆల్ ఇండియా సర్వీసెస్ వారికి దేశ సేవ చేయడమే ప్రధాన ధ్యేయం అన్నారు. తమకు కులం, మతం, ప్రాంతం తేడా ఉండదని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగిని అవమానకర భాషలో సంభోదించడం పరిపాలనా ప్రమాణాలకు విరుద్ధం అన్నారు.


