News September 8, 2025
RGM: కార్మికుల సమస్యలు పరిష్కరించాలని C&MD, డైరెక్టర్కు లేఖలు

సింగరేణి కార్మికుల సంక్షేమం, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సంస్థ C&MDబలరాం, డైరెక్టర్ గౌతమ్ పోట్రుకు లేఖలు పంపినట్లు INTUC సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్(RGM) సోమవారం తెలిపారు. ఈనెల 12న జరగబోయే కీలక సమావేశంలో ప్రధాన అంశాలను చర్చించి, ఉద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. కంపెనీ సాధించిన లాభాలలో 35% కార్మికులకు వాటా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Similar News
News September 8, 2025
వరంగల్: ఆయనే కారణం.. అందుకే చనిపోతున్న: మహిళా వీఆర్ఏ

వరంగల్ జిల్లా నల్లబెల్లి తహశీల్దార్ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్ <<17649982>>ఆత్మహత్యకు యత్నించిన<<>> విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాలు.. MRO ఆఫీస్లో పనిచేసే మహిళా VRA వాంకుడోత్ కల్పన సోమవారం సాయంత్రం పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. అంతకు ముందు ఆమె రాసిన సూసైడ్ నోట్లో చరణ్ సింగ్ కారణమని పేర్కొంది. ఆమెను నర్సంపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
News September 8, 2025
HYD: రోడ్డున పడేయలేదనా? రోడ్డుపై వదిలేశారు!

నగరవ్యాప్తంగా గణపయ్య ప్రతిమలను రోడ్లపైనే విక్రయించారు. ఆ విగ్రహాలను అమ్మి సొమ్ముచేసుకుని మిగిలిపోయినవి ఇలా ఎర్రగడ్డలో రోడ్లపైనే వదిలేశారు. లాభాలు ఇచ్చినందుకా ఇలా ఆయన బొమ్మలను రోడ్డుపై వదిలేశారని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి సనత్నగర్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. DCM వ్యాన్లో వాటిని తీసుకెళ్లి బేబీవాటర్ పాండ్, IDL చెరువులో నిమజ్జనం చేశారు. సతీశ్, సాయి ప్రకాశ్, రణ్వీర్, బవేశ్ కార్తీక్ ఉన్నారు.
News September 8, 2025
కుబీర్: ఆటో బోల్తా.. డ్రైవర్ మృతి

ఆటో బోల్తా పడి డ్రైవర్ మృతి చెందిన ఘటన కుబీర్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ కృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. లింగి గ్రామానికి చెందిన గంగాధర్ (33) భైంసా నుంటి ఆటోలో సిమెంటు బస్తాలను తీసుకువెళ్తున్నాడు. ఈ క్రమంలో ఓల్డ్ సాంవ్లీ గ్రామం వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో డ్రైవర్ గంగాధర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.