News November 9, 2025
RGM: కూల్చివేసిన ఆలయాల వద్ద పూజలు

రామగుండం కార్పొరేషన్లోని వివిధ ప్రాంతాలలో ఇటీవల అధికారులు కూల్చివేసిన దారి మైసమ్మ ఆలయాలను BJP శ్రేణులు ఆదివారం శుద్ధి చేసి, పూజలు చేశారు. BJP రాష్ట్ర మహిళా మోర్చా నాయకురాలు సోమారపు లావణ్య- అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో మహిళలు పాల్గొని అమ్మవార్లకు దీపా, దూప, నైవేద్యాలతో పూజలు నిర్వహించారు. కూల్చివేసిన ఆలయాలను కార్పొరేషన్ అధికారులు వెంటనే పునర్నిర్మించాలని ఆమె డిమాండ్ చేశారు.
Similar News
News November 9, 2025
MBNR: అప్పు ఇవ్వడమే ప్రాణం తీసిందా..?

గద్వాల్ పట్టణం శేరెల్లి వీధికి చెందిన బలిజ లక్ష్మి మృతి కేసు మిస్టరీ వీడినట్లు తెలుస్తోంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కల్లా రామిరెడ్డి.. బలిజ లక్ష్మీ దగ్గర రూ.10 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఆమె అప్పు తీర్చమని అడిగే సరికి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈనెల 2న హత్య చేసి బంగారం ఎత్తుకెళ్లాడు. నిందితుడి తండ్రి కల్లా నర్సింహరెడ్డి ఓ వ్యాపారం నడుపుతున్నాడు. పోలీసులు నిందితుడిని విచారిస్తునట్లు సమాచారం.
News November 9, 2025
RITES 40పోస్టులకు నోటిఫికేషన్

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్(<
News November 9, 2025
కాంగ్రెస్, BRS నేతలను నిలదీయండి: కిషన్ రెడ్డి

TG: కేసీఆర్ తరహాలోనే రేవంత్ కూడా మోసం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక్క అమ్మాయికీ పెళ్లి సమయంలో తులం బంగారం ఇవ్వలేదని విమర్శించారు. ‘పెన్షన్లు పెంచలేదు, కొత్తవి ఇవ్వలేదు. దళితులకు ఆర్థిక సాయం చేయలేదు. 2 లక్షల ఉద్యోగాలు ఎటు పోయాయని కాంగ్రెస్ నేతలను నిలదీయండి. గతంలో డబుల్ బెడ్రూం ఇళ్లు ఎందుకివ్వలేదని బీఆర్ఎస్ను ప్రశ్నించండి’ అని జూబ్లీహిల్స్ ఓటర్లను కోరారు.


