News September 22, 2024
ఖడ్గమృగాల దినోత్సవం.. మోదీ స్పెషల్ ట్వీట్

ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు పంచుకున్నారు. ‘అత్యంత ప్రసిద్ధ జాతులలో ఒకటైన ఖడ్గమృగాలను రక్షించడానికి మన నిబద్ధతను పునరుద్ఘాటిద్దాం. ఏళ్లుగా ఖడ్గమృగాల సంరక్షణ ప్రయత్నాలలో పాలుపంచుకున్న వారందరికీ అభినందనలు. దేశంలో అత్యధికంగా ఖడ్గమృగాలు కలిగి ఉండటం గర్వించదగ్గ విషయం. వీటిని చూసేందుకు కజిరంగా ఫారెస్ట్ను అంతా సందర్శించండి’ అని తెలిపారు.
Similar News
News January 15, 2026
ఇరాన్ పాలకులు మారితే ఇండియాకు నష్టమా?

ఇరాన్లో పాలనాపగ్గాలు మారితే భారత్పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మన దేశం నుంచి అఫ్గానిస్థాన్, సెంట్రల్ ఆసియాకు వెళ్లే మార్గాన్ని పాకిస్థాన్ మూసేసింది. ఇరాన్ నుంచే వెళ్తున్నాం. కొత్త పాలకులు వస్తే ఏం చేస్తారనేది సస్పెన్సే. అలాగే ఇరాన్లో భారత్ నిర్మిస్తున్న చాబహార్ పోర్ట్ సందిగ్ధంలో పడుతుంది. ఇరాన్ బలహీనపడితే సున్నీ మెజారిటీ ఉన్న పాకిస్థాన్ బలపడే ఛాన్సుంది.
News January 15, 2026
బీసీలకు 42% సీట్లు.. పార్టీలు ఇచ్చేనా?

TG: మున్సిపల్ ఎన్నికల్లో SC ఆదేశాలతో రిజర్వేషన్లు 50% మించకుండా అమలు చేశారు. BCలకు 42% స్థానాలు ఇస్తామన్న హామీని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్, BRSకు ఇదో అవకాశంగా ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో 32%(38 స్థానాలు) కార్పొరేషన్లో 30%(3 చోట్ల) కేటాయించింది. కాగా హామీని నెరవేర్చేందుకు మరో 12 మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లలోనూ BC అభ్యర్థులనే ప్రకటించాల్సి ఉంది. మరి పార్టీలు ఎలాంటి ప్రకటన చేస్తాయో చూడాలి.
News January 15, 2026
కనుమ రోజు గారెలు తింటున్నారా?

కనుమ నాడు మినుము తింటే మంచిదని పెద్దలు చెబుతారు. అలాగే మినుము తిన్నవాళ్లు ఇనుములా ఉంటారని మరో సామెత. చాలామంది కనుమరోజు కచ్చితంగా గారెలు తినేలా చూసుకుంటారు. అయితే పొట్టు తియ్యని మినుముల్లో పోషకాలు చాలానే ఉంటాయి. రాను రాను పొట్టు తీసిన మినప్పప్పు గారెలకు వాడుతున్నారు. కానీ మినప పొట్టుతో ఉన్న గారెలే ఆరోగ్యానికి శ్రేష్ఠం. మినుములో మాంసకృత్తులతోపాటు అనేక రకాలప్రోటీన్లు, పోషకాలు శరీరానికి లభిస్తాయి.


