News October 9, 2024
రింకూ, నితీశ్ ఫిఫ్టీ: బంగ్లాదేశ్కు భారీ టార్గెట్

బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టీ20లో టీమ్ ఇండియా భారీ స్కోర్ సాధించింది. తక్కువ స్కోరుకే మూడు వికెట్లు కోల్పోయినా నితీశ్ కుమార్ రెడ్డి (74), రింకూ సింగ్ (53) ఫిఫ్టీలతో మెరుపులు మెరిపించారు. ఇద్దరూ చెలరేగి ఆడగా, భారత్ ఓవర్లన్నీ ఆడి 221/9 రన్స్ చేసింది. చివర్లో హార్దిక్ పాండ్య (32) దూకుడుగా ఆడారు. బంగ్లా బౌలర్లలో హోస్సేన్ 3, తస్కిన్ అహ్మద్, హసన్ సాకిబ్, ముస్తాఫిజుర్ తలో రెండు వికెట్లు తీశారు.
Similar News
News January 7, 2026
US గుప్పిట్లోకి వెనిజులా సంపద.. 5 కోట్ల బ్యారెళ్ల ఆయిల్ హస్తగతం!

వెనిజులాలో మదురో ప్రభుత్వ పతనం తర్వాత అక్కడి వనరులపై అమెరికా పట్టు సాధించే దిశగా ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. వెనిజులా తాత్కాలిక ప్రభుత్వం తమకు 3-5 కోట్ల బ్యారెళ్ల చమురును అప్పగించబోతోందని ట్రంప్ ప్రకటించారు. దీన్ని మార్కెట్ ధరకే విక్రయించి.. వచ్చే నిధులను తానే స్వయంగా పర్యవేక్షిస్తానని తెలిపారు. వాటిని వెనిజులా, అమెరికా ప్రజల సంక్షేమం కోసం ఉపయోగిస్తామని తెలిపారు.
News January 7, 2026
ఈ నెల 16న బ్యాంకులకు సెలవు

AP: ఈ నెల 16న కనుమ సందర్భంగా రాష్ట్రంలోని బ్యాంకులు, వాటి అనుబంధ సంస్థలకు ప్రభుత్వం సెలవుగా ప్రకటించింది. బ్యాంకులకు ప్రభుత్వం ఇచ్చిన సెలవుల జాబితాలో జనవరి 16న సెలవు లేదు. అయితే బ్యాంకు సంఘాల విన్నపం మేరకు ప్రభుత్వం తాజాగా సెలవు ప్రకటించింది. ఈ మేరకు సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. అటు వారంలో 5 వర్కింగ్ డేస్ కోసం ఈ నెల 27న పలు బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు దిగనున్న విషయం తెలిసిందే.
News January 7, 2026
వ్యవసాయంలో ఆదాయాన్ని పెంచే ఆలోచనలు

వ్యవసాయంలోనే కాదు ఏ రంగంలోనైనా వినూత్నంగా ఆలోచించినప్పుడే ఆదాయం, అభివృద్ధి సాధ్యమవుతుంది. అయితే ఆ ఆలోచనలు మరీ గొప్పవే కానవసరం లేదు. తమకు వచ్చిన చిన్న చిన్న ఐడియాలనే సాగులో అమలు చేసి అధిక ఆదాయం పొందుతున్నారు మనదేశంతో పాటు కొన్ని దేశాల్లోని రైతులు. అసలు ఆ ఆలోచనలు ఏమిటి? మనం అనుసరించడానికి అవకాశం ఉందా? ఆదాయం పెంచే ఆ ఐడియాల గురించి తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.


