News October 9, 2024
రింకూ, నితీశ్ ఫిఫ్టీ: బంగ్లాదేశ్కు భారీ టార్గెట్

బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టీ20లో టీమ్ ఇండియా భారీ స్కోర్ సాధించింది. తక్కువ స్కోరుకే మూడు వికెట్లు కోల్పోయినా నితీశ్ కుమార్ రెడ్డి (74), రింకూ సింగ్ (53) ఫిఫ్టీలతో మెరుపులు మెరిపించారు. ఇద్దరూ చెలరేగి ఆడగా, భారత్ ఓవర్లన్నీ ఆడి 221/9 రన్స్ చేసింది. చివర్లో హార్దిక్ పాండ్య (32) దూకుడుగా ఆడారు. బంగ్లా బౌలర్లలో హోస్సేన్ 3, తస్కిన్ అహ్మద్, హసన్ సాకిబ్, ముస్తాఫిజుర్ తలో రెండు వికెట్లు తీశారు.
Similar News
News November 23, 2025
బోస్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News November 23, 2025
శ్రీవారి ఆలయంలో పంచబేర వైభవం

తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడిలో 5 ప్రధానమైన మూర్తులు కొలువై ఉన్నాయి. ప్రధానమైనది, స్వయంవ్యక్త మూర్తి అయినది ధ్రువబేరం. నిత్యం భోగాలను పొందే మూర్తి భోగ శ్రీనివాసుడు ‘కౌతుకబేరం’. ఉగ్ర రూపంలో ఉండే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు ‘స్నపన బేరం’. రోజువారీ కొలువు కార్యక్రమాలలో పాల్గొనే మూర్తి కొలువు శ్రీనివాసుడు ‘బలిబేరం’. ఉత్సవాల కోసం ఊరేగింపుగా వెళ్లే మూర్తి మలయప్పస్వామి ‘ఉత్సవబేరం’. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 23, 2025
రేపు వాయుగుండం.. 48 గంటల్లో తుఫాన్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మలక్కా, సౌత్ అండమాన్ మీదుగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. ఇది వాయవ్యదిశగా కదులుతూ రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా కొనసాగుతూ 48 గంటల్లో తుఫాన్గా బలపడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే.


