News August 27, 2024
టీ20 WCలో టీమ్లో లేకపోవడంపై స్పందించిన రింకూ

సిక్సర్లతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించే సత్తా ఉన్నప్పటికీ టీ20 వరల్డ్ కప్లో టీమ్-15లో రింకూ సింగ్కు చోటు దక్కలేదు. దీనిపై రింకూ తాజాగా స్పందించారు. ‘రోహిత్ భాయ్ నా దగ్గరకు వచ్చి అర్థమయ్యేలా చెప్పారు. నేను ఇంకా చాలా చిన్నవాడినేనని, భవిష్యత్తులో చాలా ప్రపంచ కప్లున్నాయని నిరాశ చెందొద్దన్నారు. కష్టపడి పనిచేయాలని, ఆటపై దృష్టి పెట్టాలని నాలో స్థైర్యాన్ని నింపారు’ అని చెప్పుకొచ్చారు.
Similar News
News November 14, 2025
వంటింటి చిట్కాలు

* పండ్లు, కూరగాయలు త్వరగా పాడవకుండా ఉండాలంటే వేడినీళ్లలో రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్ వేసి కడగాలి. ఆ తర్వాత సాధారణ నీటితో కడగాలి.
* దోసెలు పెనానికి అతుక్కుపోకుండా ఉండాలంటే ముందుగా పెనంపై వంకాయ లేదా ఉల్లిపాయ ముక్కతో రుద్దితే చాలు.
* కాకరకాయ కూరలో సోంపు గింజలు/ బెల్లం వేస్తే చేదు తగ్గుతుంది.
* పుదీనా చట్నీ కోసం మిక్సీలో పదార్థాలని ఎక్కువ సేపు తిప్పకూడదు. ఇలా చేస్తే చేదుగా అయిపోతుంది.
News November 14, 2025
ఒకేరోజు ఓటీటీలోకి వచ్చేసిన 3 సినిమాలు

ఇవాళ ఏకంగా మూడు సినిమాలు ఒకే OTTలోకి వచ్చేశాయి. సిద్ధు, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి నటించిన ‘తెలుసు కదా’, ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘డ్యూడ్’, ధ్రువ్ విక్రమ్, అనుపమ పరమేశ్వర్ కలిసి నటించిన ‘బైసన్’ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. విడుదలైన నెల రోజులలోపే ఈ చిత్రాలు స్ట్రీమింగ్కు రావడం గమనార్హం.
News November 14, 2025
ఒడిదుడుకుల్లో స్టాక్ మార్కెట్లు

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో మొదలయ్యాయి. నిఫ్టీ 70 పాయింట్ల నష్టంతో 25,807 వద్ద, సెన్సెక్స్ 241 పాయింట్లు కోల్పోయి 84,237 వద్ద కొనసాగుతున్నాయి. మెటల్, ఐటీ, ఆటో, FMCG స్టాక్స్ ఎరుపెక్కాయి. ముత్తూట్ ఫిన్ కార్ప్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్ లాభాల్లో ఉండగా, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, ఎయిర్టెల్, ఐటీసీ, ఇన్ఫీ, టీసీఎస్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.


