News April 14, 2025
కాంగోలో మళ్లీ అల్లర్లు.. 50 మంది మృతి

ఆఫ్రికా దేశం కాంగోలోని గోమాలో అల్లర్లు చెలరేగాయి. దీంతో దాదాపు 50 మంది చనిపోయారు. దీనికి రువాండా మద్దతుతో M23 రెబల్స్ చేస్తున్న దాడులే కారణమని సైన్యం ఆరోపించింది. తిరుగుబాటుదారుల చర్యల వల్ల శాంతి చర్చలకు విఘాతం కలుగుతోందని పేర్కొంది. ‘గోమా’తోపాటు దేశంలో రెండో అతిపెద్ద నగరమైన బుకావు కూడా రెబల్స్ అధీనంలోనే ఉంది. మూడేళ్లుగా జరుగుతున్న ఘర్షణల్లో దాదాపు 7వేల మంది మరణించగా, 2.5M మంది వలస వెళ్లారు.
Similar News
News October 22, 2025
మహిళలకు నెలకు రూ.30 వేలు.. RJD కొత్త పథకం

బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ పార్టీలు హామీలతో ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. ఇటీవల JDU-BJP ప్రభుత్వం స్వయం ఉపాధి కోసం మహిళల అకౌంట్లలో రూ.10 వేలు జమ చేయడం తెలిసిందే. తాజాగా RJD చీఫ్ తేజస్వీ యాదవ్ మహిళా సంఘాల సభ్యులను శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులను చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వస్తే ‘జీవికా CM’ స్కీం పేరిట ప్రతి నెల రూ.30,000 జీతం ఇస్తామన్నారు. లోన్లపై వడ్డీ మాఫీ చేస్తామని ప్రకటించారు.
News October 22, 2025
సినీ ముచ్చట్లు

*ప్రభాస్-హను రాఘవపూడి సినిమా థీమ్ను తెలుపుతూ కొత్త పోస్టర్ విడుదల. రేపు 11.07AMకు టైటిల్ పోస్టర్ రిలీజ్ చేస్తామని ప్రకటన
*నవంబర్ 14న ‘డ్యూడ్’ ఓటీటీ విడుదలకు నెట్ఫ్లిక్స్ ప్లాన్!
*త్రివిక్రమ్-విక్టరీ వెంకటేశ్ కొత్త సినిమాలో హీరోయిన్గా KGF బ్యూటీ శ్రీనిధి శెట్టి ఎంపిక
*ముంబైలో శిల్పాశెట్టి రెస్టారెంట్.. రోజుకు రూ.2-3 కోట్ల ఆదాయం!
News October 22, 2025
అతిభారీ వర్షాలు.. ప్రయాణాలు చేయవద్దని హెచ్చరిక

AP: దక్షిణకోస్తా, రాయలసీమలో అతిభారీ వర్షాల నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులతో హోం మంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, అత్యవసరం అయితే తప్ప ప్రజలు ప్రయాణాలు చేయవద్దని హెచ్చరించారు. NDRF, SDRF, పోలీసు, ఫైర్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. ఎమర్జెన్సీలో ప్రజలు 112, 1070, 18004250101 టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేయాలని సూచించారు.