News April 14, 2025
కాంగోలో మళ్లీ అల్లర్లు.. 50 మంది మృతి

ఆఫ్రికా దేశం కాంగోలోని గోమాలో అల్లర్లు చెలరేగాయి. దీంతో దాదాపు 50 మంది చనిపోయారు. దీనికి రువాండా మద్దతుతో M23 రెబల్స్ చేస్తున్న దాడులే కారణమని సైన్యం ఆరోపించింది. తిరుగుబాటుదారుల చర్యల వల్ల శాంతి చర్చలకు విఘాతం కలుగుతోందని పేర్కొంది. ‘గోమా’తోపాటు దేశంలో రెండో అతిపెద్ద నగరమైన బుకావు కూడా రెబల్స్ అధీనంలోనే ఉంది. మూడేళ్లుగా జరుగుతున్న ఘర్షణల్లో దాదాపు 7వేల మంది మరణించగా, 2.5M మంది వలస వెళ్లారు.
Similar News
News December 3, 2025
హిల్ట్ పాలసీ లీక్.. విచారణకు ప్రభుత్వం ఆదేశం!

TG: హిల్ట్ పాలసీ కసరత్తు దశలోనే వివరాలు బయటకు రావడంపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. నవంబర్ 20నే ఫొటోషాప్ స్లైడ్స్ బయటకు వచ్చాయని అనుమానిస్తోంది. మరుసటి రోజే <<18440700>>హిల్ట్ <<>>పాలసీపై KTR ప్రెస్మీట్ పెట్టడంతో కొందరు సీనియర్ IAS అధికారులకు CM వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. NOV 22న జీవో విడుదలవ్వగా లీక్ విషయమై ఐపీఎస్ నేతృత్వంలో నిఘా వర్గాలు సమాచారం సేకరించే పనిలో పడ్డాయి.
News December 3, 2025
సంచార్ సాథీ యాప్తో స్నూపింగ్ సాధ్యం కాదు: కేంద్రం

సంచార్ సాథీ యాప్తో స్నూపింగ్ జరగలేదు, జరగబోదని లోక్సభలో కేంద్రమంత్రి సింధియా స్పష్టం చేశారు. భారత్లో అమ్మే ప్రతి ఫోన్లో ఆ యాప్ ప్రీ ఇన్స్టాల్ చేయాలని మొబైల్ తయారీ కంపెనీలకు సూచించారు. ఇప్పటికే అమ్మిన వాటిలో సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా ఇన్స్టాల్ చేయాలన్నారు. మొదటిసారి ఫోన్ వాడేటప్పుడు కూడా డిజేబుల్, రెస్ట్రిక్ట్ చేసే ఆప్షన్స్ ఉండబోవని చెప్పారు. ప్రజల భద్రతే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమన్నారు.
News December 3, 2025
హనుమాన్ చాలీసా భావం – 28

ఔర మనోరథ జో కోయీ లావై |
సోయి అమిత జీవన ఫల పావై ||
మనుషులు అనేక కోరికలతో దేవుళ్లను ప్రార్థిస్తారు. కానీ, హనుమంతుడిని సేవించేవారు మాత్రం జీవితంలో అపారమైన జీవన ఫలాలను పొందుతారు. ఆయన అనుగ్రహంతో అన్ని రకాల సుఖ సంతోషాలు, విజయాలు, అంతిమంగా మోక్షం కూడా లభిస్తాయి. హనుమంతుడిని వరం కోరడం అంటే, ఇక వేరే కోరిక అవసరం లేదు అని సందేశం. <<-se>>#HANUMANCHALISA<<>>


