News September 25, 2025

వాంగ్‌చుక్ ప్రకటనలతోనే లేహ్‌లో అల్లర్లు: కేంద్రం

image

పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ ప్రకటనలతోనే లద్దాక్‌లో <<17816320>>అల్లర్లు<<>> జరిగాయని కేంద్ర హోంశాఖ ప్రకటన రిలీజ్ చేసింది. పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు సాయంత్రానికి అదుపులోకి వచ్చాయని పేర్కొంది. లద్దాక్ ప్రజలకు రాజ్యాంగపరమైన రక్షణను కల్పిస్తూ వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వీడియోలను షేర్ చేయొద్దని సూచించింది.

Similar News

News September 25, 2025

డీజీపీ రేసులో ఆ ఇద్దరు?

image

TG: డీజీపీ జితేందర్ ఈ నెలాఖరులో రిటైర్ కానుండగా ఆయన స్థానంలో శివధర్ రెడ్డి, సీపీ ఆనంద్ రేసులో ఉన్నట్లు సమాచారం. శివధర్ రెడ్డి ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉండగా, ఆనంద్ HYD సీపీగా కొనసాగుతున్నారు. అయితే మరో 7 నెలల్లో రిటైర్ కానున్న శివధర్ వైపే ప్రభుత్వం మొగ్గు చూపుతుందని డిపార్ట్‌మెంట్‌లో చర్చ జరుగుతోంది. అదే జరిగితే ఆనంద్‌ను విజిలెన్స్, ఏసీబీ చీఫ్‌గా నియమించే అవకాశముందని తెలుస్తోంది.

News September 25, 2025

ఆసియాకప్ నుంచి శ్రీలంక ఔట్

image

ఆసియాకప్‌ 2025లో శ్రీలంక ఇంటి బాట పట్టింది. నిన్నటి మ్యాచులో బంగ్లాదేశ్‌పై టీమ్ ఇండియా గెలవడంతో ఆ జట్టు ఆశలు గల్లంతయ్యాయి. ఇవాళ పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగే మ్యాచులో గెలిచిన జట్టు ఫైనల్ చేరనుంది. పాక్ గెలిస్తే ఈ ఎడిషన్‌లో మూడో సారి టీమ్‌ఇండియాతో తలపడనుంది. అటు రేపు జరిగే భారత్, శ్రీలంక మధ్య మ్యాచ్ నామమాత్రమే కానుంది. కాగా ఫైనల్ ఈ నెల 28న జరగనుంది.

News September 25, 2025

దుర్గగుడిలో ప్రొటోకాల్ దర్శన వేళలు మార్పు: ఈవో

image

AP: దసరా ఉత్సవాల నేపథ్యంలో విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయంలో ప్రొటోకాల్ దర్శన వేళలు మార్చినట్లు ఈవో శీనానాయక్ తెలిపారు. ఇవాళ్టి నుంచి ఉ.5-6 గంటల వరకు, మ.3 నుంచి 4 గంటల వరకు, సా.8 నుంచి 9 గంటల వరకు ప్రొటోకాల్ దర్శనాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. సాధారణ భక్తుల కోసమే ఈ మార్పు చేపట్టినట్లు వెల్లడించారు. దేవీ శరన్నవరాత్రులలో భాగంగా ఇవాళ అమ్మవారు కాత్యాయని దేవిగా భక్తులకు దర్శనమిస్తారు.