News June 1, 2024

మహారాష్ట్రలో హోరాహోరీ

image

మహారాష్ట్రలో ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య హోరాహోరీ పోరు సాగినట్లు Times Of India Poll అంచనా వేసింది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు 22-26, ఇండియా కూటమికి 23-25, ఇతరులకు 0-10 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉందని తెలిపింది.

Similar News

News January 10, 2026

జంగా కృష్ణమూర్తికి CM చంద్రబాబు ఫోన్!

image

AP: పల్నాడు నేత జంగా కృష్ణమూర్తి నిన్న TTD బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో CM CBN ఆయనకు ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం. దీంతో జంగా ఇవాళ లేదా రేపు CMను కలవనున్నట్లు సన్నిహిత వర్గాలు చెప్పాయి. కాగా తిరుమలలో అతిథి గృహం నిర్మించడానికి తనకు స్థలం కేటాయింపు పునరుద్ధరణపై ఓ పత్రికలో కథనాలు వచ్చాయని జంగా పేర్కొన్నారు. దీనిపై మనస్తాపం చెంది రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

News January 10, 2026

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ రూ.1,150 పెరిగి రూ.1,40,460కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,050 ఎగబాకి రూ.1,28,750 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.7వేలు పెరిగి రూ.2,75,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.

News January 10, 2026

‘వ్యవసాయ యాంత్రీకరణ’ పథకంలో రాయితీ ఇలా..

image

ఈ పథకం కింద యంత్రాల కొనుగోలుకు ప్రభుత్వం భారీగా సబ్సిడీ ఇస్తోంది. లబ్ధిదారుల కేటగిరీని బట్టి దీనిలో వాటా ఉంటుంది. సన్న, చిన్నకారు, మహిళా రైతులు, SC, ST, BC రైతులు యంత్రాన్ని కొనుగోలు చేస్తే ధరలో 50% వారు భరించాలి. మిగిలిన 50 శాతాన్ని ప్రభుత్వం రాయితీగా నేరుగా కంపెనీ ఖాతాలో జమ చేస్తుంది. ఇతర రైతులు యంత్రం ధరలో 60 శాతం వాటాను భరించాల్సి ఉండగా.. 40 శాతాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరిస్తుంది.