News September 26, 2024
ఫేక్ న్యూస్పై రిషభ్ పంత్ ఆగ్రహం

తాను RCBలోకి వెళ్లేందుకు యత్నించగా విరాట్ అడ్డుకున్నారని ఓ నెటిజన్ చేసిన ట్వీట్పై రిషభ్ పంత్ మండిపడ్డారు. సెన్సిబుల్గా ఉండటం నేర్చుకోవాలని క్లాస్ పీకారు. ‘ఇది ఫేక్ న్యూస్. ఎందుకు ఇలాంటి వార్తల్ని వ్యాప్తి చేస్తారు? ఇదేమీ ఫస్ట్ టైమ్ కాదు. రోజురోజుకూ తప్పుడు వార్తల ప్రచారం పెరుగుతోంది. ఇది కేవలం మీకు మాత్రమే కాదు. ఇలాంటి పనులు చేసే వారందరికీ కూడా చెబుతున్నా’ అని స్పష్టం చేశారు.
Similar News
News October 30, 2025
BIG ALERT: నేడు భారీ వర్షాలు

తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. ఆదిలాబాద్, భూపాలపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. మిగతా జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయంది. అటు ఏపీలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వానలు పడవచ్చని వెల్లడించింది.
News October 30, 2025
బాలింతల ఆహారంలో ఇవి ఉన్నాయా?

గర్భం దాల్చినప్పటి బిడ్డకు రెండేళ్లు ముగిసేవరకు మహిళలకు అదనపు పోషకాలు అందించాలంటున్నారు నిపుణులు. ఇవే బిడ్డ శారీరక, మానసిక పెరుగుదలకు తోడ్పడుతుంది. అందుకే బాలింతలు మొదటి 6నెలలు రోజువారీ ఆహారంలో 600 క్యాలరీలు, 13.6 గ్రా ప్రొటీన్ ఉండేలా చూసుకోవాలంటున్నారు. 6-12 నెలల మధ్యలో 520 క్యాలరీలు, 10.6గ్రా ప్రొటీన్ తీసుకోవాలి. వీటితో పాటు ప్రతిరోజూ 290mg అయోడిన్, 550mg కోలిన్ తీసుకోవాలంటున్నారు.
News October 30, 2025
తిరుమలలో మరిన్ని శాశ్వత క్యూలైన్లు

AP: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. SSD టోకెన్లు కలిగిన భక్తుల కోసం తిరుమలలోని ఏటీజీహెచ్ అతిథి గృహం సమీపంలో నూతన షెడ్లు, క్యూలైన్ల మార్గాన్ని నిర్మించాలని నిర్ణయించింది. బాటగంగమ్మ ఆలయం నుంచి గోగర్భం జలాశయం కూడలి వరకు 3కి.మీ మేర రూ.17.60 కోట్లతో శాశ్వత క్యూలైన్లు, మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలు కల్పించనుంది. భక్తుల రద్దీని దృష్టిని ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.


