News April 13, 2024

రికార్డు సృష్టించిన రిషభ్ పంత్

image

ఐపీఎల్‌లో అతి తక్కువ బంతుల్లో (2028) మూడు వేల పరుగులు చేసిన బ్యాటర్‌గా రిషభ్ పంత్ రికార్డు సృష్టించారు. అతని తర్వాతి స్థానాల్లో యూసుఫ్ పఠాన్(2062), సూర్యకుమార్ యాదవ్(2130), రైనా(2135) ఉన్నారు. అంతేకాకుండా అతి పిన్న వయసులో 3వేల రన్స్ చేసిన ప్లేయర్లలో పంత్ మూడో స్థానంలో నిలిచారు. అతనికంటే (26y, 191d) ముందు గిల్ (24y, 215d), కోహ్లీ(26y, 186d) ఈ ఫీట్‌ను సాధించారు.

Similar News

News October 11, 2024

జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన బెళగల్ విద్యార్థి

image

కోసిగి మండలం దొడ్డి బెళగల్‌కు చెందిన జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి సందిప్ ఆగ్రాలో జరిగిన జాతీయ స్థాయి లాక్రోస్ క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించాడు. విద్యార్థిని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జీయాన్ కుమారి అభినందించారు. ఆమె మాట్లాడుతూ.. తమ పాఠశాల విద్యార్థి జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించడం సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో మరింత మెరుగైన స్థాయిలో ఆడాలని ఆకాంక్షించారు.

News October 11, 2024

టెన్త్ అర్హతతో 39,481 ఉద్యోగాలు.. మరో 3 రోజులే ఛాన్స్!

image

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులకు దరఖాస్తు గడువు సమీపిస్తోంది. 39,481 పోస్టులకు అక్టోబర్ 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 18-23 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్హత: టెన్త్ పాస్ అయి ఉండాలి. పురుషులకు 35,612, మహిళలకు 3869 పోస్టులు ఉన్నాయి. BSF, CISF, CRPF, SSB, ITBP, SSF, ARలో ఉద్యోగాలు భర్తీ చేస్తారు. దరఖాస్తు చేసుకోవాల్సిన <>సైట్<<>>: https://ssc.gov.in/

News October 11, 2024

ఈవీఎంలపై చంద్రబాబు కప్పదాటు మాటలు: మేరుగు

image

AP: ఈవీఎంలపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్‌పై ఉందని మాజీ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. గతంలో EVMలపై చంద్రబాబే ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు మేం ప్రశ్నిస్తుంటే చంద్రబాబు మాపై కోప్పడుతున్నారని మండిపడ్డారు. కేంద్రంలో ఉన్నప్పుడు ఒకమాట, లేనప్పుడు మరోమాట మాట్లాడుతున్నారన్నారని, సంపన్న దేశాలు సైతం బ్యాలెట్ వైపు మొగ్గు చూపుతున్న విషయాన్ని గమనించాలన్నారు.