News December 6, 2024

రిషభ్ పంత్ ఇప్పుడు నా సహచరుడు: లాంగర్

image

ఆస్ట్రేలియాలో భారత్ గత పర్యటనల సమయంలో రిషభ్ పంత్ తనకు పీడకలలు మిగిల్చారని ఆసీస్ మాజీ కోచ్ జస్టిన్ లాంగర్ ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు మాత్రం పంత్ తనకు ప్రత్యర్థి కాదని, మంచి సహచరుడయ్యారని తెలిపారు. ఆస్ట్రేలియాలో గత రెండు BGT సిరీస్‌లలోనూ పంత్ కీలక ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను గెలిపించారు. లాంగర్ కోచ్‌గా ఉన్న LSG జట్టు IPL వేలంలో ఆయన్ను కొనుగోలు చేసింది.

Similar News

News January 19, 2026

ఇతిహాసాలు క్విజ్ – 128 సమాధానం

image

ప్రశ్న: అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి వెళ్లడం తెలిసినా, బయటకు రావడం ఎందుకు తెలియదు?
సమాధానం: అభిమన్యుడు తన తల్లి సుభద్ర గర్భంలో ఉన్నప్పుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించే విధానం గురించి వివరిస్తుంటే విన్నాడు. అయితే, వ్యూహం నుంచి బయటకు వచ్చే మార్గాన్ని చెప్పే సమయానికి సుభద్ర నిద్రపోయింది. దీంతో గర్భంలో ఉన్న అభిమన్యుడికి లోపలికి వెళ్లడం మాత్రమే తెలిసింది. బయటకు రావడం తెలియలేదు.
<<-se>>#Ithihasaluquiz<<>>

News January 19, 2026

భారత పర్యటనలో UAE అధ్యక్షుడు

image

UAE అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్‌ భారత్‌లో పర్యటిస్తున్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రధాని మోదీ ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇద్దరూ కారులో ప్రయాణించారు. నహ్యాన్ పర్యటనతో ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు మరింత బలపడతాయని మోదీ ఆకాంక్షించారు.

News January 19, 2026

జియో హాట్‌స్టార్ షాక్.. పెరిగిన ప్లాన్ల ధరలు

image

జియో హాట్‌స్టార్ ప్లాన్ల ధరలను సవరించింది. జనవరి 28 నుంచి అమల్లోకి వచ్చే కొత్త రేట్ల ప్రకారం సూపర్, ప్రీమియం కేటగిరీల్లోని 3 నెలల, వార్షిక ప్లాన్ల ధరలు పెరిగాయి. ముఖ్యంగా ప్రీమియం వార్షిక ప్లాన్ ₹1,499 నుంచి ₹2,199కి చేరింది. మొబైల్ ప్లాన్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కొత్తగా మొబైల్ ప్లాన్ ₹79, సూపర్ ₹149, ప్రీమియం ₹299 నెలవారీ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ పెంపు కొత్త సబ్‌స్క్రైబర్లకు మాత్రమే.