News November 29, 2024

RISHABH PANT: ఒకే ఒక్కడు

image

BCCI, IPL కాంట్రాక్టుల ద్వారా టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ ఏటా రూ.30 కోట్లు ఆర్జించబోతున్నారు. IPL ద్వారా రూ.27 కోట్లు, BCCI కాంట్రాక్టు ద్వారా రూ.3 కోట్లు సంపాదిస్తారు. వచ్చే ఏడాది A+ గ్రేడ్‌కు వెళ్తే ఇది మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఇవే కాక ప్రమోషన్లు, వ్యాపారాలతో పంత్ ఇంకాస్త ఆర్జించనున్నారు. రోహిత్ శర్మ (రూ.23.3 కోట్లు), విరాట్ కోహ్లీ(రూ.28 కోట్లు)కి కూడా ఇంత రాకపోవడం గమనార్హం.

Similar News

News December 3, 2025

ఇండిగోలో సిబ్బంది కొరత.. పలు ఫ్లైట్లు ఆలస్యం, రద్దు

image

సిబ్బంది కొరతతో పలు ఇండిగో విమాన సర్వీసులు లేట్‌గా నడుస్తుండగా, కొన్ని రద్దవుతున్నాయి. మంగళవారం 35% ఫ్లైట్లు మాత్రమే సమయానికి నడిచినట్టు తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం వరకు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు తదితర విమానాశ్రయాల నుంచి బయలుదేరాల్సిన 200 సర్వీసులు రద్దయ్యాయి. నవంబర్‌లో ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (FDTL) అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇండిగోలో పైలట్లు, ఫ్లైట్ సిబ్బంది కొరత ఎదుర్కొంటోంది.

News December 3, 2025

రూ.3.30 నుంచి రూ.90 వరకు.. రూపాయి పతనం ఇలా!

image

స్వాతంత్య్రం(1947) వచ్చేనాటికి డాలరుతో రూపాయి మారకం విలువ రూ.3.30 ఉండేది. 30 సంవత్సరాల తర్వాత..
☛ 1977లో అది రూ.8.434కు చేరింది
☛ తరువాతి 30 ఏళ్ల(2007)కు 43.595గా ఉంది
☛ 2020లో రూ.73.23, 2021లో రూ.74.56, 2022లో రూ.82.76, 2023లో 83.4
☛ 2024లో 83.28కు బలహీనపడింది
☛ తాజాగా 2025 డిసెంబర్ నాటికి 90 రూపాయలకు పతనమైంది.

News December 3, 2025

భారీ ఎన్‌కౌంటర్.. 15 మంది మృతి

image

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా దంతెవాడ అడవుల్లో జరిగిన భారీ <<18458130>>ఎన్‌కౌంటర్‌లో<<>> మృతుల సంఖ్య పెరిగింది. ఎదురుకాల్పుల్లో 12 మంది మావోలు మరణించగా ముగ్గురు పోలీసులు అమరులయ్యారు. ఘటనాస్థలం నుంచి మావోలకు సంబంధించిన భారీ ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు జనవరి 1న అంతా లొంగిపోతామని ఇటీవల అభయ్ పేరిట మావోయిస్టు పార్టీ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.