News September 9, 2024

RISHABH PANT: 634 రోజుల తర్వాత రీఎంట్రీ

image

టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ 634 రోజుల తర్వాత టెస్టుల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. బంగ్లాదేశ్‌తో జరగబోయే తొలి టెస్టుకు పంత్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. రోడ్డు ప్రమాదం తర్వాత టీ20, వన్డేల్లో ఆడినా సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆయన ఇంకా ఆడలేదు. ఈ క్రమంలో బంగ్లా సిరీస్‌కు ఆయన ఎంపికయ్యారు. ఆ తర్వాత జరిగే బోర్డర్-గావస్కర్ ట్రోఫీకి కూడా పంత్ ఎంపిక లాంఛనమే. ఆసీస్‌పై అతడి మెరుగైన గణాంకాలే ఇందుకు నిదర్శనం.

Similar News

News December 9, 2025

మచ్చలు పడుతున్నాయా?

image

చాలామంది మహిళలు తప్పు సైజు, నాణ్యత తక్కువగా ఉన్న లోదుస్తులను వాడతారు. దీని వల్ల కొన్నిసార్లు చర్మంపై మచ్చలు పడే అవకాశం ఉంది. వీటిని పోగొట్టడానికి కొన్ని ఇంటి చిట్కాలు. * స్పూన్ పంచదారలో నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని మచ్చలున్న చోట రాసి మర్దనా చేయాలి. * పాలు, బాదం నూనెలను కలిపి మచ్చలున్న ప్రాంతాల్లో రాయాలి. * పెరుగులో చిటికెడు పసుపు కలిపి, ఆ మిశ్రమాన్ని మచ్చలు ఉన్న దగ్గర రాస్తే మార్పు కనిపిస్తుంది.

News December 9, 2025

ఆర్థిక సమస్యలను తొలగించే ‘ద్వార లక్ష్మీ పూజ’

image

ఇంటి గడపను లక్ష్మీ ద్వారంగా భావించి, దేవతలను ఆహ్వానించడానికి పసుపు, కుంకుమలతో అలంకరిస్తాం. అయితే 16 రోజులు ‘ద్వార లక్ష్మీ పూజ’ ఆచరిస్తే ఆర్థిక సమస్యలు తొలగి, కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా పెళ్లికాని ఆడపిల్లలు, జాతక దోషంతో బాధపడుతున్నవారు ఈ పూజ చేయాలని సూచిస్తున్నారు. లక్ష్మీ ద్వార పూజ ఎప్పుడు, ఎలా చేయాలి? పూజా ఫలితాలు తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.

News December 9, 2025

గొర్రెల మందలో విత్తన పొట్టేలు ప్రాముఖ్యత(2/2)

image

ప్రతీ రెండు నుంచి మూడేళ్లకు ఒకసారి విత్తన పొట్టేలును మార్చాలి. ఎంపిక చేసుకునే పొట్టేలు దృఢంగా, ఎత్తుగా, చురుకుగా, ఎక్కువ బరువు, అధిక లైంగికాసక్తి కలిగి ఉండాలి. ముఖ్యంగా కవల పిల్లలను కనే సంతతి నుంచి వచ్చిన పొట్టేలును ఎంచుకోవడం చాలా మంచిదని వెటర్నరీ నిపుణులు సూచిస్తున్నారు. రెండేళ్లకు పైన వయసున్న పొట్టేలును మాత్రమే ఎంచుకోవాలి. మరింత సమాచారం కోసం వెటర్నరీ నిపుణుల సలహా తీసుకోవాలి.