News August 7, 2024
నీరజ్ స్వర్ణం గెలిస్తే.. ఫ్యాన్స్కు రిషభ్ పంత్ ఆఫర్!

ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా రేపు స్వర్ణం గెలిస్తే ఫ్యాన్స్లో ఒకరికి రూ.100089 బహుమతిగా ఇస్తానని క్రికెటర్ రిషభ్ పంత్ ట్విటర్లో ప్రకటించారు. ఆ ట్వీట్ను లైక్ చేసి, అత్యధికంగా కామెంట్ చేసిన వారికి అది దక్కుతుందన్నారు. ఇక అత్యధికంగా కామెంట్లు చేసినవారిలో తొలి 10మందికి ఫ్లైట్ టికెట్స్ ఇస్తానని పేర్కొన్నారు. ‘భారత్తో పాటు దేశం బయటి నుంచి కూడా నా సోదరుడికి మద్దతు కూడగడదాం’ అని పంత్ పిలుపునిచ్చారు.
Similar News
News January 5, 2026
HOT TOPIC: ఆంధ్రకూ పాకిన జలజగడం…

TGలో INC, BRSల వరకే ఉన్న జలజగడం కాస్తా APకీ పాకింది. YCP విమర్శలతో ‘రాయలసీమ లిఫ్ట్’ పై రేవంత్ చేసిన కామెంట్లను AP GOVT ఖండించింది. దానివల్లే తాను TDPని వదిలానని రేవంత్ విమర్శలు చేశారు. దీంతో నదీ జలాలపై రిప్లైకి CBN సిద్ధమవుతున్నారు. అటు ఈ అంశాన్ని రాజకీయాస్త్రంగా మలుచుకొనేందుకు జగన్ అడుగులు వేస్తున్నారు. ఏదేమైనా నదీ జలాలపై వేడెక్కిన రాజకీయాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్టాపిక్గా మారాయి.
News January 5, 2026
OTTలోకి ‘ధురంధర్’.. ఎప్పుడంటే?

రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సినిమా పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1200కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఈ మూవీ ఈ నెల 30 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఇండియాలో రూ.800కోట్లకు పైగా కలెక్ట్ చేసిన తొలి హిందీ సినిమాగా ‘ధురంధర్’ నిలిచింది. ఇందులో రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా నటనకు ప్రశంసలొచ్చాయి.
News January 5, 2026
మహిళా ఆఫీసర్లకు మంత్రి వేధింపులు: BRS

TG: రాష్ట్ర మంత్రి ఒకరు మహిళా ఆఫీసర్లను వేధిస్తున్నారని BRS ఆరోపించింది. “ఎవరా అమాత్యుడు? కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళా అధికారులకు రక్షణ ఎక్కడ? ఒక మంత్రి స్థాయి వ్యక్తి మహిళా అధికారులను వేధింపులకు గురిచేస్తుంటే రేవంత్ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? ఇదేనా మీరు గొప్పగా చెప్పుకునే ‘ఇందిరమ్మ రాజ్యం’? వెంటనే సదరు మంత్రిని క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి” అని డిమాండ్ చేస్తూ ఓ <


