News March 24, 2025
హోరెత్తిస్తున్న షేర్లు: రూ.5లక్షల కోట్ల లాభం

స్టాక్మార్కెట్లు దూకుడు మీదున్నాయి. వరుసగా ఆరో సెషన్లోనూ దుమ్మురేపుతున్నాయి. MON మిడ్ సెషన్కు నిఫ్టీ 23,616 (+270), సెన్సెక్స్ 77,834 (+930) వద్ద ట్రేడవుతున్నాయి. ఇన్వెస్టర్ల సంపద రూ.5లక్షల కోట్లమేర పెరిగింది. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం, FIIs తిరిగి పెట్టుబడులు ఆరంభించడం, డాలర్తో రూపాయి బలపడుతుండటం, బ్యాంకింగ్ స్టాక్స్ జోరు, ఇన్వెస్టర్ల విశ్వాసం పెరగడమే ఇందుకు కారణాలు.
Similar News
News January 21, 2026
‘మీ ఫోన్ కూడా ట్యాప్’?.. ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్!

TG: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో హరీశ్ రావుకు సిట్ అధికారులు సంచలన విషయాలు చెప్పినట్లు తెలుస్తోంది. ‘2018 ఎన్నికల తర్వాత మీ ఫోన్, మీ కుటుంబసభ్యుల ఫోన్లు ట్యాప్ అయ్యాయని మీకు తెలుసా?’ అని ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో హరీశ్ షాక్కు గురై ‘ఇది మీరు సృష్టించారా?’ అని అడిగారని, పోలీసులు ట్యాప్ అయిన తేదీలు చెబుతూ ఆధారాలు చూపించారని వార్తలొస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
News January 21, 2026
WPL: ఇక థ్రిల్లింగ్ మ్యాచులేనా?

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL-2026) ఈసారి థ్రిల్లింగ్గా మారింది. ఇప్పటికే RCB ప్లేఆఫ్ బెర్త్ ఖరారు చేసుకోగా మిగతా 2 జట్లు తేలాల్సి ఉంది. MI, యూపీ, గుజరాత్, ఢిల్లీ నాలుగేసి పాయింట్లతో ఉన్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై మిగతా 2 మ్యాచ్ల్లో గెలిస్తేనే పోటీలో ఉంటుంది. అటు గుజరాత్, ఢిల్లీ, UP తొలిసారి ట్రోఫీని అందుకునే అవకాశాన్ని నిలుపుకోవాలంటే మిగతా మ్యాచుల్లో ఆధిపత్యం ప్రదర్శించాల్సిందే.
News January 21, 2026
రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్మెంట్లో ఉద్యోగాలు

రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్మెంట్ <


