News March 24, 2025

హోరెత్తిస్తున్న షేర్లు: రూ.5లక్షల కోట్ల లాభం

image

స్టాక్‌మార్కెట్లు దూకుడు మీదున్నాయి. వరుసగా ఆరో సెషన్లోనూ దుమ్మురేపుతున్నాయి. MON మిడ్ సెషన్‌కు నిఫ్టీ 23,616 (+270), సెన్సెక్స్ 77,834 (+930) వద్ద ట్రేడవుతున్నాయి. ఇన్వెస్టర్ల సంపద రూ.5లక్షల కోట్లమేర పెరిగింది. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం, FIIs తిరిగి పెట్టుబడులు ఆరంభించడం, డాలర్‌తో రూపాయి బలపడుతుండటం, బ్యాంకింగ్ స్టాక్స్ జోరు, ఇన్వెస్టర్ల విశ్వాసం పెరగడమే ఇందుకు కారణాలు.

Similar News

News March 26, 2025

సూర్యాపేట: ధాన్యం కొనుగోలుకు సన్నద్ధమవుతున్న యంత్రాంగం

image

సూర్యాపేట జిల్లాలో యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులకు ఉండొద్దని ఏప్రిల్ మొదటి వారంలోనే కొనుగోళ్లు ప్రారంభించేలా సివిల్ సప్లై అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. యాసంగి సీజన్లో జిల్లా వ్యాప్తంగా 4,73,739 ఎకరాల్లో వరిసాగు చేయగా దాదాపు 4.07 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనాలు వేశారు.

News March 26, 2025

ALERT: నేడు 108 మండలాల్లో వడగాలులు

image

AP: రాష్ట్రంలో ఇవాళ 108 మండలాల్లో వడగాలులు వీస్తాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం (15), విజయనగరం (21), మన్యం (10), అల్లూరి (8), అనకాపల్లి (7), కాకినాడ (7), కోనసీమ (3), తూర్పుగోదావరి (13), ఏలూరు (5), కృష్ణా (2), ఎన్టీఆర్ (6), గుంటూరు (3), పల్నాడు జిల్లాలోని 8 మండలాల్లో వడగాలులు వీస్తాయని అంచనా వేసింది. అలాగే ఇవాళ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని పేర్కొంది.

News March 26, 2025

మెగాస్టార్-అనిల్ సినిమా స్టార్ట్ అయ్యేది అప్పుడే!

image

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కే సినిమాకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఉగాది రోజున ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు మేకర్స్ సిద్ధమైనట్లు సినీవర్గాలు తెలిపాయి. దీనిని వినోదభరితమైన చిత్రంగా రూపొందిస్తారని పేర్కొన్నాయి. కాగా ఇప్పటికే చిరు ‘విశ్వంభర’ షూటింగ్ పూర్తి చేసుకోగా, మే 9న విడుదల కానుంది. ఇక అనిల్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే.

error: Content is protected !!