News April 8, 2025
రాష్ట్రంలో బార్స్, వైన్స్ మధ్య రగడ

TG: రాష్ట్రంలో మద్యం దుకాణాల మధ్య వివాదం చెలరేగింది. వైన్ షాపులు రాత్రి 11 గంటలకు తెరిచి ఉండటం వల్ల తాము నష్టపోతున్నామని, 10 గంటలకే మూసేలా చర్యలు తీసుకోవాలని బార్ల అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పర్మిట్ రూములనూ మూసేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు తమ వల్లే ప్రభుత్వానికి 85% ఆదాయం వస్తోందని, బార్ల వల్ల 15% మాత్రమే ఆదాయం వస్తోందని వైన్స్ అసోసియేషన్ నాయకులు వాదిస్తున్నారు.
Similar News
News April 17, 2025
వెబ్సైటులో ఇంటర్ షార్ట్ మెమోలు

AP: 2024-25 విద్యాసంవత్సరం మార్కుల మెమోలను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. విద్యార్థులు వెబ్సైటులో రోల్ నంబర్, పాస్ ఇయర్, కోర్సు, పుట్టినతేదీ ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇటీవల విడుదల చేసిన ఫలితాల్లో ఫస్టియర్లో 70శాతం, సెకండ్ ఇయర్లో 83శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మెమో డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ <
News April 17, 2025
మొన్న ఓడించిన రనౌట్లే.. నిన్న గెలిపించాయి!

IPL: APR 13న ముంబై నిర్దేశించిన 205 పరుగులను ఛేదిస్తూ హ్యాట్రిక్ రనౌట్ల వల్ల ఢిల్లీ మ్యాచ్ ఓడిపోయిన విషయం తెలిసిందే. నిన్న RR మ్యాచ్లో అవే రనౌట్లు గెలిపించాయి. స్టార్క్ వేసిన 20వ ఓవర్లో చివరి బంతికి జురెల్ రనౌట్ కావడంతో మ్యాచ్ టై అయింది. ఆ తర్వాత సూపర్ ఓవర్లో 5 బంతుల్లోనే పరాగ్, జైస్వాల్ రనౌట్లు కావడంతో RR 11 పరుగులకే పరిమితమైంది. 12 రన్స్ లక్ష్యాన్ని ఈజీగా ఛేదించి DC మ్యాచ్ గెలిచింది.
News April 17, 2025
అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్కు ఉద్వాసన!

టీమ్ ఇండియా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్కు BCCI ఉద్వాసన పలకనున్నట్లు తెలుస్తోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత పేలవ ప్రదర్శనకు బాధ్యుడిని చేస్తూ అతడిని తప్పిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ఫీల్డింగ్ కోచ్ దిలీప్, ట్రైనర్ సోహమ్ దేశాయ్ను కూడా వదిలేస్తున్నట్లు సమాచారం. కాగా అభిషేక్ను 7 నెలల క్రితమే బీసీసీఐ అసిస్టెంట్ కోచ్గా నియమించింది. స్వల్పకాలంలోనే అతడిని పక్కనబెట్టబోతోంది.