News April 8, 2025

రాష్ట్రంలో బార్స్, వైన్స్ మధ్య రగడ

image

TG: రాష్ట్రంలో మద్యం దుకాణాల మధ్య వివాదం చెలరేగింది. వైన్ షాపులు రాత్రి 11 గంటలకు తెరిచి ఉండటం వల్ల తాము నష్టపోతున్నామని, 10 గంటలకే మూసేలా చర్యలు తీసుకోవాలని బార్ల అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పర్మిట్ రూములనూ మూసేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు తమ వల్లే ప్రభుత్వానికి 85% ఆదాయం వస్తోందని, బార్ల వల్ల 15% మాత్రమే ఆదాయం వస్తోందని వైన్స్ అసోసియేషన్ నాయకులు వాదిస్తున్నారు.

Similar News

News December 6, 2025

అన్నమయ్య: కట్నం కోసం వేధించిన ఐదుగురికి జైలు శిక్ష

image

సుండిపల్లి మండలంలో వివాహితను కట్నం కోసం వేధించిన ఐదుగురికి కోర్టు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. వీరబల్లి మండలం మట్లి వడ్డిపల్లికి చెందిన చెల్లారెడ్డి శివప్రసాద్ అతని తల్లిదండ్రులతో పాటు మరో ఇద్దరిపై వరకట్న వేధింపులపై 2022లో కేసు నమోదైంది. వారికి రాయచోటి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.7 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పినట్లు SP కార్యాలయం వెల్లడించింది.

News December 6, 2025

అన్నమయ్య: కట్నం కోసం వేధించిన ఐదుగురికి జైలు శిక్ష

image

సుండిపల్లి మండలంలో వివాహితను కట్నం కోసం వేధించిన ఐదుగురికి కోర్టు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. వీరబల్లి మండలం మట్లి వడ్డిపల్లికి చెందిన చెల్లారెడ్డి శివప్రసాద్ అతని తల్లిదండ్రులతో పాటు మరో ఇద్దరిపై వరకట్న వేధింపులపై 2022లో కేసు నమోదైంది. వారికి రాయచోటి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.7 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పినట్లు SP కార్యాలయం వెల్లడించింది.

News December 6, 2025

అరుణాచల ప్రదక్షిణకు HYD నుంచి ప్రత్యేక బస్సులు

image

అరుణాచలగిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తుల కోసం HYD–2 డిపో DSNR నుంచి ప్రత్యేక బస్సులను RTC అందుబాటులోకి తెచ్చింది. బస్సులు DEC 12న రాత్రి 7 గంటలకు బయలుదేరి, కాణిపాకం–గోల్డెన్ టెంపుల్ మీదుగా అరుణాచలం చేరుతాయి. తిరుగు ప్రయాణం 14న మ.3గంటలకు ప్రారంభమై ఉ.8గంటలకు HYD చేరుకోనుందని HYD-2 డిపో మేనేజర్ కరుణశ్రీ తెలిపారు. ఒక్క టికెట్ ధర రూ.3,900 మరిన్ని వివరాలకు 9959444165 నంబర్లకు సంప్రదించాలన్నారు.