News February 25, 2025

RJY: ఆదర్శ యోజన నిధులను సద్వినియోగం చేసుకోవాలి

image

పీఎం ఆదర్శ యోజన కార్యక్రమంలో భాగంగా ప్రతిపాదిత పనులు ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో మార్చి 31 లోగా పూర్తి చేయాలని కలెక్టర్ పి.ప్రశాంతి స్పష్టం చేశారు. సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద పీఎం ఆదర్శ యోజన పనుల పురోగతిపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆదర్శ యోజన నిధులను సద్వినియోగం చేసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

Similar News

News December 23, 2025

ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఈసీ మెంబర్‌గా దత్తుడు

image

కొవ్వూరు పట్టణానికి చెందిన ఆర్యవైశ్య సంఘం నాయకుడు ఎంబీఎస్ ప్రసాద్(దత్తుడు) ఏపీ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఎంపికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు వక్కలగడ్డ భాస్కర రావు నుంచి నియామక ఉత్తర్వులు అందినట్లు ఆయన తెలిపారు. దత్తుడు గతంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. కొవ్వూరు రైస్ అండ్ కిరాణా మధ్యంత అసోసియేషన్ అధ్యక్షుడిగా వ్యవహరించారు.

News December 22, 2025

తూ.గో. ఎస్పీ నరసింహ కిషోర్‌కు DGP బ్రాంజ్ డిస్క్ అవార్డు

image

తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ DGP బ్రాంజ్ డిస్క్ అవార్డును దక్కించుకున్నారు. డీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ అధికారుల సేవలను గుర్తించి సిల్వర్, బ్రోన్జ్ డిస్క్ అవార్డులను ప్రకటించారు. అందులో భాగంగా జిల్లా ఎస్పీ నరసింహ‌ కిషోర్, కడియం‌ ఎస్సై బి.నాగ దుర్గాప్రసాద్, సిబ్బందికి ఈ అవార్డులను ప్రకటించారు. ఈ సందర్భంగా ఎస్పీకి పోలీసు అధికారులు సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.

News December 22, 2025

రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అమర్జహే బెగ్

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కొవ్వూరు మండలం కాపవరం గ్రామానికి చెందిన అమర్జహ బేగ్ మహమ్మద్ నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు అందాయన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్కలాంబ, ఏపీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలకి ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు.