News March 31, 2025
RJY: పాస్టర్ ప్రవీణ్ కేసులో కీలక విషయాలు

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఆదివారం బెజవాడలో ప్రవీణ్ కేసు విచారణలో సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రమాదం జరిగిన రోజు ప్రవీణ్ గుంటుపల్లి నుంచి భవానీపురం మధ్య బైక్తో సహా రోడ్డుపై పడిపోయినట్లు సీసీ ఫుటేజీలో కనిపించింది. అదే సమయంలో అతని బైక్ డోమ్ పగిలినట్లు గుర్తించారు. త్వరలో మరిన్ని వివరాలు వివరించనున్నట్లు వారు పేర్కొన్నారు.
Similar News
News November 12, 2025
బిలియనీర్ల అడ్డా ముంబై, ఢిల్లీ!

ప్రపంచంలో ఎక్కువ మంది బిలియనీర్లు ఉండే టాప్-10 నగరాల జాబితాలో ముంబై, ఢిల్లీ చోటు దక్కించుకున్నాయి. 119 మంది కుబేరులతో న్యూయార్క్ టాప్లో ఉందని హురున్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక వెల్లడించింది. ఆ తర్వాత లండన్(97), ముంబై(92), బీజింగ్(91), షాంఘై(87), షెంజెన్(84), హాంకాంగ్(65), మాస్కో(59), ఢిల్లీ(57), శాన్ఫ్రాన్సిస్కో(52) ఉన్నాయి.
News November 12, 2025
పెద్దపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

ఢిల్లీలో టెర్రరిస్టులు జరిపిన కారు బాంబు దాడిలో మరణించిన భారతీయులకు పెద్దపల్లి ప్రెస్ క్లబ్ ఆద్వర్యంలో కొవ్వొత్తులతో మంగళవారం నివాళి అర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న సీఐ కొండపాక ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. టెర్రరిజం మానవ మనుగడకు పెనుప్రమాదం అన్నారు. క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఉగ్రవాదంపై ప్రభుత్వం ఉక్కు పాదాన్ని మోపాలని పేర్కన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు, తదితరులున్నారు.
News November 12, 2025
కామారెడ్డి: ప్రజావాణి దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

సీఎం ప్రజావాణి, జిల్లా ప్రజావాణిలో పెండింగ్లోని దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మండల అధికారులను ఆదేశించారు. మంగళవారం తహశీల్దార్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. దరఖాస్తుల పరిష్కారంలో ప్రత్యేక చొరవ చూపాలని, సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజల సమస్యలను పెండింగ్లో పెట్టొద్దని గట్టిగా చెప్పారు.


