News February 9, 2025
RJY: సంగీతా నృత్య పాఠశాలను సందర్శించిన మంత్రి

రాజమండ్రిలోని విజయశంకర్ ప్రభుత్వ సంగీతా నృత్యపాఠశాలను శనివారం రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక ,సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థినీవిద్యార్థులతో మాట్లాడారు. సంగీత నృత్య పాఠశాల అభివృద్ధికి కృషిచేస్తానని తెలిపారు. రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక శాఖ కమీషన్ ఛైర్పర్సన్ పొడపాటి తేజస్విని పాల్గొన్నారు.
Similar News
News March 22, 2025
రాజానగరం: సేద్యపు నీటి కుంటను ప్రారంభించిన కలెక్టర్

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (NREGS)ద్వారా సేద్యపు నీటి కుంటను జిల్లా కలెక్టర్ ప్రశాంతి కొబ్బరికాయ కొట్టి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తోకాడ గ్రామం నుంచే మొట్టమొదటిగా ఇంకుడు గుంట కార్యక్రమాన్ని ప్రారంభించామని ఆమె అన్నారు. జిల్లాలో ప్రతి ఒక్కరూ ప్రకృతి వనరులైన నీటిని ఒడిసిపెట్టి, దాచి నట్లయితే రాబోయే తరాలవారికి మంచి తాగునీటిని అందించగలమని అన్నారు.
News March 22, 2025
IPL: కాకినాడ కుర్రాడిపైనే దృష్టంతా!

మరికొన్ని గంటల్లో ఐపీఎల్ ప్రారంభమవుతుంది. మామిడికుదురు(M) గోకులమఠంలో పుట్టిన సత్యనారాయణరాజు ఐపీఎల్లో MI తరఫున ఆడుతున్నాడు. గోదావరి జిల్లాల ప్రజల చూపు ఇప్పుడు అతడిపైనే ఉంది. మొదటిసారి ఐపీఎల్లో ఎలా ఆడతాడని అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. రంజీ పోటీల్లో 8 మ్యాచ్లో 17 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం కాకినాడలో ఉంటున్నాడు. ఈ కుర్రాడికి ప్లేయింగ్-11లో చోటు దక్కుతుందేమో వేచి చూడాలి.
News March 22, 2025
తూ.గో: ఆరేళ్ల తర్వాత సంచలన తీర్పు

కామవరపుకోట(M) గుంటుపల్లి బౌద్ధాలయాల వద్ద 2019లో ప్రేమజంటపై దాడి జరిగింది. ఈక్రమంలో యువతిని హత్య చేశారు. గోపాలపురం నియోజకవర్గం ద్వారకాతిరుమల(M) జి.కొత్తపల్లికి చెందిన సోమయ్య(22), గంగయ్య(20), నందివాడ(M) అరిశెల గ్రామానికి చెందిన నాగరాజును నిందితులుగా గుర్తించారు. వీరికి జీవిత ఖైదు విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి సుమా సునంద శిక్ష విధించారని ఏలూరు SP ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు.