News April 18, 2025
RJY: డోర్ డెలివరీ కేసు.. ప్రత్యేక న్యాయవాదిగా ముప్పాళ్ల

ఏపీలో సంచలనం రేకెత్తించిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ అలియాస్ అనంతబాబు డోర్డెలివరీ కేసులో న్యాయ విచారణకు ఏపీ ప్రభుత్వం ఈ మేరకు గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఈ న్యాయ విచారణలో ప్రాసిక్యూషన్కు సహాయం చేయడానికి ప్రత్యేక న్యాయవాదిగా ప్రముఖ సీనియర్ న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సెల్ సభ్యుడు, మానవ హక్కుల రక్షణ కోసం పోరాటం చేస్తున్న ముప్పాళ్ల సుబ్బారావును నియమించింది.
Similar News
News February 24, 2026
241 రిపోర్టులు వచ్చాయి.. రాజమండ్రి మరణాలపై ఎంపీ కీలక వ్యాఖ్యలు!

రాజమండ్రి చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాల్లో కిడ్నీ వైఫల్య ఘటనల నేపథ్యంలో ఎంపీ పురందీశ్వరి మంగళవారం మెడికల్ క్యాంపును పరిశీలించారు. కలుషిత పాలు తాగి నలుగురు మరణించడం, చిన్నారులకు డయాలసిస్ చేయాల్సి రావడం బాధాకరమన్నారు. మొత్తం 293 మంది నుంచి శాంపిళ్లు సేకరించగా, 241 రిపోర్టులు అందాయని తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
News February 24, 2026
రాజమండ్రి: కల్తీ పాల ఘటన.. రంగంలోకి స్పెషలిస్ట్ డాక్టర్!

రాజమండ్రిలో ఆక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ కేసుల నేపథ్యంలో కిడ్నీ వ్యాధుల నిపుణుడు డాక్టర్ రవిరాజు మంగళవారం బాధితులను సందర్శించారు. కలెక్టర్ కీర్తి చేకూరి పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఆయన సమగ్రంగా పరిశీలించారు సరైన ప్రోటోకాల్తో వైద్యం అందుతోందని స్పష్టం చేశారు. అనుసరించాల్సిన విధానాలపై స్థానిక వైద్యులకు పలు సూచనలు చేశారు.
News February 24, 2026
రాజమండ్రి: పాల కల్తీకి కారణం ‘కూలెంట్’ లీకేజీ!

కలకలం రేపిన కల్తీ పాల ఘటనకు కారణాలను అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. గణేశ్ కూలింగ్ ఛాంబర్లో మరమ్మతులు చేస్తుండగా, ఫ్రిడ్జ్లోని ‘ఇథిలీన్ గ్లైకాల్’ అనే కూలెంట్ లీకై పాలలో కలిసినట్లు నిర్ధారించినట్లు సమాచారం. వరలక్ష్మీ డెయిరీ పేరుతో అనధికారికంగా ఈ కేంద్రం నిర్వహిస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. వారం క్రితమే ఈ లీకేజీ జరిగినట్లు సమాచారం. బాధ్యులపై చర్యలకు సిద్ధమవుతున్నారు.


