News March 30, 2025

RKP: అమ్మాయి కోసం యువకుడి సూసైడ్

image

ఉరేసుకొని యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన రామకృష్ణాపూర్‌లో జరిగింది. ఎస్ఐ రాజశేఖర్ వివరాల ప్రకారం.. అబ్రహంనగర్‌కి చెందిన వినయ్(26) ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. తనకు ఆమెతో పెళ్లి చేయాలని తల్లికి చెప్పడంతో ఉద్యోగం వచ్చాక పెళ్లి చేస్తానని వినయ్ తల్లి సముదాయించింది. కాగా, తనకు ఉద్యోగం లేకపోవడంతో ఆ అమ్మాయిని ఎలా పోషించాలని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.

Similar News

News November 6, 2025

‘ఉచితం, తక్కువ లాభం’ అంటే మోసమే: ఏసీపీ

image

సైబర్ నేరాల గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సిద్దిపేట సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏసీపీ శ్రీనివాస్ సూచించారు. సైబర్ జాగృతి దివస్ సందర్భంగా సిద్దిపేట మెడికల్ కళాశాల విద్యార్థులకు గురువారం అవగాహన కల్పించారు. సైబర్ నేరగాళ్లు ఆశ, భయం పేరుతో భయపెడుతూ, మభ్యపెడుతున్నారని, జాగ్రత్తగా ఉండాలన్నారు. ఉచితం లేదా తక్కువ సమయంలో ఎక్కువ లాభం వస్తుందంటే అది మోసమే అని గ్రహించాలని ప్రజలకు ఏసీపీ సూచించారు.

News November 6, 2025

20 ఏళ్ల తరువాత తొలిసారి అక్కడ పోలింగ్

image

బిహార్ భీమ్‌బంద్ ప్రాంతంలోని 7 పోలింగ్ కేంద్రాల పరిధిలోని ప్రజలు 20 ఏళ్ల తరువాత తొలిసారి ఓట్లు వేశారు. 2005 JAN 5న తారాపూర్‌ దగ్గర భీమ్ బంద్ ప్రాంతంలో నక్సల్స్ పోలీసులు లక్ష్యంగా ల్యాండ్‌మైన్ పేల్చారు. పేలుడులో ముంగేర్ SP సురేంద్ర బాబు, ఆరుగురు పోలీసులు చనిపోయారు. అప్పటి నుంచి అధికారులు అక్కడ పోలింగ్ నిర్వహించడం లేదు. ఈసారి సాయుధ దళాలను మోహరించి పోలింగ్ జరిపారు. ప్రజలు స్వేచ్ఛగా ఓట్లు వేశారు.

News November 6, 2025

రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరపాలి: కలెక్టర్

image

హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ గురువారం పరకాలలోని ధనలక్ష్మి కాటన్ ఇండస్ట్రీస్‌లో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఇప్పటివరకు 13 మంది రైతుల నుంచి 140 క్వింటాళ్ల పత్తి కొనుగోలు జరిగిందని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, పత్తి విక్రయించిన వెంటనే డబ్బులు ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.