News March 17, 2025

RMP వేధింపులు.. మహిళ ఆత్మహత్యాయత్నం?

image

RMP వేధిస్తున్నాడంటూ ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. బండి ఆత్మకూరు(M) కడమల కాల్వకు చెందిన ఓ మహిళను RMP లైంగికంగా వేధిస్తున్నాడు. ఇదే విషయమై ఫిబ్రవరిలో బండి ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. కేసు వాపస్ తీసుకోవాలంటూ తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి RMP వేధించడంతో మహిళ విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిందని బంధువులు తెలిపారు.

Similar News

News March 18, 2025

ఓయూలో ఆంక్షలపై కిషన్ రెడ్డి ఆగ్రహం

image

TG: ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు తెలపడంపై ప్రభుత్వం నిషేధం విధించడం అప్రజాస్వామికమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో, విద్యార్థుల హక్కులకు సంబంధించిన ఎన్నో పోరాటాల్లో కీలకపాత్ర పోషించింది ఓయూ విద్యార్థులే అని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం పౌరుల ప్రాథమిక హక్కు అని, పోలీసుల పహారాలో ఆ హక్కును అణచివేయాలని చూస్తే తెలంగాణ సమాజం అంగీకరించదని హెచ్చరించారు.

News March 18, 2025

కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

➤ఆదోనిలో ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ సందడి
➤ ఓర్వకల్ ఎయిర్పోర్ట్ కు ఉయ్యాలవాడ పేరు పెట్టాలని వినతి
➤ ఆదోనిలో మృతదేహంతో ఆందోళన
➤ క్లస్టర్ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వీసీగా బసవరావు
➤ పదో తరగతి పరీక్షలు.. తొలిరోజే ఇద్దరు డిబార్
➤ పెద్దకడబూరు: ‘భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి’
➤ ఆదోని సమస్యలపై ఎమ్మెల్యే పార్థసారథి అసెంబ్లీలో గళం

News March 18, 2025

విజయవాడ: సికింద్రాబాద్ వెళ్లే రైలు ప్రయాణికులకు అలర్ట్

image

విజయవాడ మీదుగా విశాఖపట్నం(VSKP)-లోకమాన్య తిలక్(LTT) మధ్య ప్రయాణించే 2 ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రయాణించే రూట్‌లో రైల్వే శాఖ మార్పులు చేసింది. సికింద్రాబాద్ స్టేషన్‌లో అభివృద్ధి పనులు చేస్తున్నందున నం.18519 VSKP- LTT రైలు ఏప్రిల్ 24, నం.18520 LTT- VSKP ఏప్రిల్ 22 నుంచి మౌలాలి, సికింద్రాబాద్‌లో ఆగదని అధికారులు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైళ్లు ఆయా తేదీలలో చర్లపల్లి మీదుగా నడుస్తున్నాయన్నారు.

error: Content is protected !!