News December 30, 2024
రోహిత్ 6సార్లు ఔట్.. కమిన్స్ సరికొత్త చరిత్ర

ఆసీస్ కెప్టెన్, బౌలర్ పాట్ కమిన్స్ చరిత్ర సృష్టించారు. ప్రత్యర్థి జట్టు సారథిని ఎక్కువసార్లు ఔట్ చేసిన కెప్టెన్గా నిలిచారు. ఇప్పటి వరకు కమిన్స్ ఆరుసార్లు రోహిత్ను పెవిలియన్కు పంపారు. అంతకుముందు రీచీ బెనాడ్(AUS) ఇంగ్లండ్ ప్లేయర్ టెడ్ డెక్స్టర్ను ఐదుసార్లు ఔట్ చేశారు. ఆ తర్వాత ఇమ్రాన్vsగవాస్కర్(5), రీచీ బెనాడ్vsరామ్చంద్(4), కపిల్ దేవ్vs స్లివే ల్యాడ్(4), రిచర్డ్ బెనాడ్vs పీటర్ మే(4) ఉన్నారు.
Similar News
News November 27, 2025
రాష్ట్రంలో 60 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (<
News November 27, 2025
చలికాలంలో పాదాలు పగులుతున్నాయా?

చలికాలంలో కనిపించే ప్రధాన సమస్యల్లో మడమల పగుళ్లు ఒకటి. చలి కాలంలో పొడి గాలుల కారణంగా మడమల చర్మంలో తేమ తగ్గుతుంది. ఈ కారణంగా చర్మం పొడిగా మారి పాదాలలో పగుళ్లు ఏర్పడుతాయి. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా మాయిశ్చరైజ్ అప్లై చేసి సాక్సులు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. డీ హైడ్రేషన్ వల్ల కూడా పాదాలు పగులుతాయి కాబట్టి తగినంత నీరు తాగాలని చెబుతున్నారు.
News November 27, 2025
పారిపోయిన వారిని తీసుకొచ్చే హక్కు కేంద్రానికి ఉంది: సుప్రీంకోర్టు

నేరాలు చేసి విదేశాలకు పారిపోయిన వారిని తీసుకొచ్చే హక్కు కేంద్రానికి ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. గుజరాత్కు చెందిన విజయ్ మురళీధర్ ఉద్వానీ కేసు విచారణలో జడ్జీలు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. 2022 జులైలో దుబాయ్ పారిపోయిన ఉద్వానీపై గుజరాత్ హైకోర్టు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. దానిని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది.


