News December 28, 2024
రోహిత్ ఓ విఫల కెప్టెన్, బ్యాటర్: MSK ప్రసాద్

టీమ్ ఇండియా కెప్టెన్ ఆస్ట్రేలియా పర్యటనలో పూర్తిగా నిరాశపరుస్తున్నారని బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ విమర్శించారు. ఇటు బ్యాటింగ్, అటు కెప్టెన్సీలో పూర్తిగా విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. ‘రోహిత్ ఆడిన మూడు టెస్టుల్లోనూ పరుగులు రాబట్టలేకపోయారు. ఫామ్ లేమితో ఆయన సతమతమవుతున్నారు. మరోవైపు కెప్టెన్సీలోనూ బౌలర్లను ఉపయోగించడంలో అంతగా ఆకట్టుకోవడం లేదు’ అని ఆయన విమర్శించారు.
Similar News
News December 17, 2025
రూ.లక్షకు రూ.73లక్షల వడ్డీ.. కిడ్నీ అమ్ముకున్న రైతు

వ్యవసాయంలో నష్టాలతో పాల వ్యాపారం చేద్దామనుకున్న రైతు కిడ్నీ అమ్ముకున్న విషాద ఘటన MHలో జరిగింది. చందాపూర్(D)కు చెందిన కుడే అనే రైతు వడ్డీ వ్యాపారుల వద్ద రూ.లక్ష అప్పు తీసుకున్నాడు. లాభాలు రాకముందే ఆవులు చనిపోయాయి. రోజుకు రూ.10వేల వడ్డీ వేయడంతో అప్పు రూ.74లక్షలకు చేరింది. పొలం, ట్రాక్టర్ అమ్మినా అప్పు తీరలేదు. దీంతో వ్యాపారుల సలహాతో కుడే కంబోడియా వెళ్లి రూ.8లక్షలకు కిడ్నీ అమ్మి వారికి చెల్లించాడు.
News December 17, 2025
ధనుర్మాసం: ఏయే పూజలకు ఏయే ఫలితాలు?

ధనుర్మాసంలో వైష్ణవాలయాన్ని దర్శించాలని పండితులు సూచిస్తున్నారు. గంధాన్ని భక్తులకు పంచితే మంచి జరుగుతుందని అంటున్నారు. అగ్నిపురాణం ప్రకారం.. ఆలయానికి శక్తి కొలది దానం చేస్తే విశేష ఫలితం ఉంటుంది. సంపంగి పూలతో విష్ణును పూజిస్తే కుజదోషం పోతుంది. ఏజ్ పెరిగినా.. పెళ్లికాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది. తెల్లగన్నేరు పూలతో స్వామిని అర్చిస్తే ఆర్థిక సమస్యలు తొలగి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని నమ్మకం.
News December 17, 2025
నేడే మూడో విడత పోలింగ్

TG: పంచాయతీ ఎన్నికల చివరి విడత పోలింగ్కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇవాళ 3,752 సర్పంచ్, 28,410 వార్డు స్థానాలకు ఓటింగ్ జరగనుంది. సర్పంచ్ బరిలో 12,652 మంది, వార్డుల బరిలో 75,725 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. చివరి విడతలో 53,06,395 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మూడో విడత ఎన్నికల వేళ రూ.9.11 కోట్ల నగదు, మద్యం, మాదక ద్రవ్యాలను పోలీసులు సీజ్ చేశారు.


