News November 16, 2024

మరోసారి తండ్రైన రోహిత్‌.. టీమ్ ఇండియాకు గుడ్ న్యూస్?

image

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్‌శర్మ మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి రితిక కాసేపటి క్రితం పిల్లాడికి జన్మనిచ్చారు. ఇప్పటికే వీరికి కూతురు సమైరా ఉన్నారు. ఇదిలా ఉంటే జూ.రోహిత్ వచ్చేస్తున్నాడని కొందరు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ నెల 22న ఆస్ట్రేలియాతో జరగాల్సిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి రోహిత్ అందుబాటులో ఉంటారని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే భారత జట్టుకు గుడ్ న్యూస్ కానుంది.

Similar News

News November 3, 2025

టిప్పర్ డ్రైవర్ గుర్తింపు

image

TG: రంగారెడ్డి జిల్లాలో <<18184089>>బస్సు ప్రమాదానికి<<>> కారణమైన టిప్పర్ డ్రైవర్‌ను పోలీసులు గుర్తించారు. అతడు మహారాష్ట్రకు చెందిన ఆకాశ్ అని వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన లచ్చానాయక్ దగ్గర డ్రైవర్‌గా పని చేస్తున్నాడని తెలిపారు. హైదరాబాద్ శివారు పటాన్‌చెరులోని క్రషర్ మిల్లు నుంచి వికారాబాద్‌కు కంకర తీసుకెళ్తుండగా మీర్జాగూడ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆకాశ్ కూడా చనిపోయాడు.

News November 3, 2025

US ఆంక్షల ఎఫెక్ట్.. చైనా మాస్టర్ ప్లాన్!

image

రష్యా ఆయిల్ కంపెనీలపై US ఆంక్షల నేపథ్యంలో చైనా తమ చమురు నిల్వలను భారీగా పెంచుకుంటోంది. 2025లో తొలి 9 నెలల్లో చైనా రోజుకు 11M బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకున్నట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఇందులో 1-1.2M బ్యారెళ్లను నిల్వల కోసం దారి మళ్లించినట్లు వివరించింది. చమురు అవసరాల కోసం ఆ దేశం 70% విదేశాలపైనే ఆధారపడుతోంది. చైనా చమురు నిల్వల సామర్థ్యం 2 బిలియన్ బ్యారెళ్లకు పైగా ఉందని అంచనా.

News November 3, 2025

అడగడానికి ఇంకేం ప్రశ్నలే లేవా.. మీడియాపై సిద్దరామయ్య ఆగ్రహం

image

కర్ణాటకలో సీఎం మార్పు గురించి ఇటీవల జోరుగా చర్చ జరుగుతోంది. ఇదే విషయాన్ని మీడియా ప్రశ్నించగా CM సిద్దరామయ్య సీరియస్ అయ్యారు. ‘అడగడానికి ఇంకేం ప్రశ్నలు లేవా? ప్రజలు తమకు నచ్చిన దాని గురించి మాట్లాడుకోనీయండి. హైకమాండ్ ఎవరు? సోనియాగాంధీ, రాహుల్, మల్లికార్జున ఖర్గే చెప్పారా దీని గురించి’ అని ప్రశ్నించారు. బిహార్ ఎన్నికల తర్వాత క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణపై అధిష్ఠానంతో మాట్లాడతానని తెలిపారు.