News July 9, 2024
శ్రీలంకతో సిరీస్కు రోహిత్, కోహ్లీ దూరం?
వచ్చే నెలలో శ్రీలంకతో జరిగే 3 మ్యాచుల వన్డే సిరీస్కు టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కానున్నట్లు సమాచారం. ఆయనతో పాటు కోహ్లీ, బుమ్రా తమకు లాంగ్ బ్రేక్ కావాలని బీసీసీఐని కోరినట్లు PTI పేర్కొంది. కేఎల్ రాహుల్ లేదా హార్దిక్ పాండ్యను ఈ సిరీస్కు కెప్టెన్గా నియమించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. శ్రేయస్, పంత్ తిరిగి వన్డే టీమ్లోకి వచ్చే ఛాన్సుందని అంచనా వేసింది.
Similar News
News October 15, 2024
హైదరాబాద్లో యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారం
TG: హైదరాబాద్లో దారుణం జరిగింది. గచ్చిబౌలిలోని ఓ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. చెన్నై నుంచి లింగంపల్లి వచ్చిన ఆమె నానక్రామ్గూడ వెళ్లేందుకు ఈ తెల్లవారుజామున 2.30 గంటలకు ఆటో ఎక్కింది. డ్రైవర్ మసీద్ బండ ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడి, అక్కడే వదిలేసి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
News October 15, 2024
మార్కెటింగ్ కంటెంట్లో AIతో జాగ్రత్త.. లేదంటే!
AIతో లాభాలున్నా సరైన పర్యవేక్షణ లేకుంటే జరిగే నష్టం అపారం. వెస్ట్రన్ కల్చర్, లాంగ్వేజెస్ వరకు పర్లేదు గానీ భారతీయ భాషలు, కల్చర్పై అవగాహన లేకుంటే దెబ్బ తప్పదు. ‘ఐపిల్ గర్భనిరోధక మాత్ర నిన్ను మిస్సవుతోంది పల్లవీ’ అంటూ జెప్టో పంపిన నోటిఫికేషన్ దీనినే తెలియజేస్తోంది. ఇలాంటి కంటెంట్ ఇస్తున్నప్పుడు మానవ పర్యవేక్షణ కంపల్సరీ అంటున్నారు నిపుణులు. గుడ్డిగా AIని నమ్మొద్దంటున్నారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి?
News October 15, 2024
విద్యార్థులతో కలిసి టీచర్ భోజనం చేయాలి: ప్రభుత్వం
AP: వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో విద్యార్థులకు మెరుగైన ఆహారాన్ని అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ‘ఫుడ్ను తనిఖీ చేసేలా ముగ్గురు తల్లులతో కమిటీ వేయాలి. రోజూ ఒక టీచర్/ బోధనేతర సిబ్బంది విద్యార్థులతో కలిసి భోంచేయాలి. వార్డెన్స్, ప్రిన్సిపల్ రుచి చూశాకే పిల్లలకు వడ్డించాలి. రాత్రి ఆహారం ఉదయం పెట్టకూడదు. వంట గదిని పరిశుభ్రంగా ఉంచాలి’ అని ఆదేశించింది.