News August 14, 2024
దులీప్ ట్రోఫీకి దూరంగా రోహిత్, కోహ్లీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_82024/1723634114295-normal-WIFI.webp)
దులీప్ ట్రోఫీలో ఆడే జట్లను BCCI ప్రకటించింది. స్టార్ ప్లేయర్లు రోహిత్, విరాట్, బుమ్రా, పాండ్య ఈ టోర్నీకి దూరంగా ఉన్నారు. ముందునుంచీ వీరు ఆడుతారనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 4 జట్లకు గిల్, ఈశ్వరన్, రుతురాజ్, అయ్యర్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. పంత్, సూర్య, రాహుల్, జడేజా, సిరాజ్, అక్షర్, కిషన్, జైస్వాల్, దూబే, తిలక్ వర్మ ఆయా జట్లకు ఆడనున్నారు. SEP 5 నుంచి 22 వరకు మ్యాచులు జరగనున్నాయి.
Similar News
News February 8, 2025
0..0..0: ఢిల్లీలో కాంగ్రెస్ హ్యాట్రిక్ డకౌట్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739006096036_1199-normal-WIFI.webp)
దేశ రాజధాని ఢిల్లీ ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోట. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కనీసం 40% ఓటుషేర్ సంపాదించేది. మాజీ CM షీలాదీక్షిత్ నాయకత్వంలో వరుసగా హ్యాట్రిక్ విజయాలు అందుకున్న పార్టీ. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. వరుసగా మూడో సారీ ఖాతా తెరవకుండా హ్యాట్రిక్ డకౌట్ రికార్డు ఖాతాలో వేసుకుంది. క్రితంసారి 3% ఓటుషేర్ సాధించిన హస్తం పార్టీ ఈసారి 7 శాతంతో ఆనందపడాల్సి వస్తోంది. ఆ పార్టీ దుస్థితిపై మీ కామెంట్.
News February 8, 2025
బీజేపీ ఘన విజయం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739006555960_653-normal-WIFI.webp)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ 36 స్థానాల మేజిక్ ఫిగర్ను దాటేసింది. మరో 11 చోట్ల లీడింగ్లో కొనసాగుతోంది. దీంతో 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ కోటపై కాషాయ జెండా ఎగిరింది. అటు ఆప్ 19 స్థానాల్లో గెలిచి 4 చోట్ల ఆధిక్యంలో ఉంది.
News February 8, 2025
ఢిల్లీ ప్రజలు అభివృద్ధి, సుపరిపాలనకు ఓటేశారు: మోదీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739005906176_746-normal-WIFI.webp)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం పొందడంపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘జనశక్తి ప్రధానం. అభివృద్ధి, సుపరిపాలనను గెలిపించారు. ఈ చరిత్రాత్మక విజయాన్ని అందించిన ఢిల్లీలోని నా ప్రియమైన సోదర, సోదరీమణులకు సెల్యూట్. ఢిల్లీని అభివృద్ధి చేయడంలో, ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడంలో, వికసిత్ భారత్ను నిర్మించడంలో ఢిల్లీ ప్రధాన పాత్ర పోషించే విధంగా పనిచేస్తామని హామీ ఇస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.