News August 12, 2024
దులీప్ ట్రోఫీలో ఆడనున్న రోహిత్, కోహ్లీ?

వచ్చే 4 నెలల్లో భారత్ 10 టెస్టులు ఆడనుంది. వీటిలో మొదటిది వచ్చే నెల 19న బంగ్లాదేశ్తో మొదలుకానుంది. ఈ నేపథ్యంలో సుదీర్ఘ ఫార్మాట్లో మళ్లీ టచ్లోకి వచ్చేందుకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దులీప్ ట్రోఫీలో ఆడాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన జాతీయ జట్టు ఆటగాళ్లలో ఎక్కువ శాతం మందికి రెస్ట్ ఇచ్చినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. బంగ్లాతో టెస్టు సిరీస్కు షమీ మళ్లీ జట్టులోకి రావొచ్చని అంచనా వేశాయి.
Similar News
News December 23, 2025
నాడు ఊరిలో సఫాయీ.. నేడు ఊరికే సర్పంచ్

TG: నిర్మల్ జిల్లా తానూర్ మండలం తొండాలకి చెందిన మిరేకర్ మాధవ్ ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యమేనని నిరూపించారు. 19 ఏళ్ల పాటు గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేశారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ఎస్సీ రిజర్వేషన్ రావడంతో ఆయన పోటీ చేసి గెలుపొందారు. నిన్న మాధవ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సఫాయీ కార్మికుడిగా ఉన్న తనను సర్పంచ్ చేసిన గ్రామస్థులకు ధన్యవాదాలు తెలిపారు.
News December 23, 2025
జుట్టు ఆరోగ్యం కోసం ఏం తినాలంటే?

జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే దాన్ని సంరక్షించడంతో పాటు పోషకాహారం తీసుకోవడం కూడా ముఖ్యం. దీనికోసం బాదం, చిలగడదుంప, గుడ్డు, శనగలు, పాలకూర తినాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిల్లో ఉండే బయోటిన్, ఐరన్, ఫోలేట్, విటమిన్ C ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరచి జుట్టు కుదుళ్లకు ఆక్సిజన్ సరఫరా చేస్తాయి. జుట్టు రాలిపోతున్నా, పలచగా ఉన్నా ఈ ఫుడ్స్ ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.
News December 23, 2025
APPLY NOW: NIT గోవాలో పోస్టులు

<


