News August 12, 2024

దులీప్ ట్రోఫీలో ఆడనున్న రోహిత్, కోహ్లీ?

image

వచ్చే 4 నెలల్లో భారత్ 10 టెస్టులు ఆడనుంది. వీటిలో మొదటిది వచ్చే నెల 19న బంగ్లాదేశ్‌తో మొదలుకానుంది. ఈ నేపథ్యంలో సుదీర్ఘ ఫార్మాట్‌లో మళ్లీ టచ్‌లోకి వచ్చేందుకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దులీప్ ట్రోఫీలో ఆడాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన జాతీయ జట్టు ఆటగాళ్లలో ఎక్కువ శాతం మందికి రెస్ట్ ఇచ్చినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. బంగ్లాతో టెస్టు సిరీస్‌కు షమీ మళ్లీ జట్టులోకి రావొచ్చని అంచనా వేశాయి.

Similar News

News December 21, 2025

నేడే పల్స్ పోలియో.. నిర్లక్ష్యం చేయకండి

image

AP: నేడు రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇవాళ కచ్చితంగా ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించండి. 38,267 బూత్‌ల ద్వారా 54,07,663 మంది చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేయనున్నారు. తప్పని పరిస్థితుల్లో ఇవాళ మిస్ అయితే రేపు, ఎల్లుండి కూడా వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఈ న్యూస్ షేర్ చేసి మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ను అలర్ట్ చేయండి.

News December 21, 2025

ధనుర్మాసం: ఆరో రోజు కీర్తన

image

‘‘తెల్లవారింది, పక్షులు కిలకిలారావాలు చేస్తున్నాయి. స్వామి ఆలయంలోని శంఖధ్వని నీకు వినబడలేదా? పూతనను, శకటాసురుని సంహరించిన ఆ శ్రీకృష్ణుడే పాలకడలిపై శయనించిన శ్రీమన్నారాయణుడు. మునులు, యోగులు భక్తితో చేస్తున్న ‘హరి! హరి!’ నామస్మరణతో మేమంతా మేల్కొన్నాము. కానీ నువ్వు ఇంకా నిద్రిస్తున్నావేంటి? ఓ గోపికా! వెంటనే మేల్కొను. మాతో కలిసి ఆ స్వామి వ్రతంలో పాల్గొని మోక్షాన్ని పొందుదాం, రా!’’ <<-se>>#DHANURMASAM<<>>

News December 21, 2025

ఉదయాన్నే ఈ డ్రింక్ తాగి చూడండి!

image

లేవగానే లెమన్ వాటర్ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చాలామందికి తెలుసు. అయితే దానికి చిటికెడు పసుపు కలిపితే మరిన్ని బెనిఫిట్స్ ఉంటాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ‘లెమన్ వాటర్‌లో ఉండే విటమిన్ సీ శరీరంలోని టాక్సిన్స్‌ను క్లియర్ చేస్తుంది. పసుపులో ఉండే కర్కుమిన్ వల్ల లివర్ ఫంక్షన్ మెరుగవుతుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా, కిడ్నీలకు కావాల్సిన సపోర్ట్‌ను కూడా అందిస్తుంది’ అని చెబుతున్నారు.