News January 6, 2025
ఇంగ్లండ్తో వన్డేలు ఆడనున్న రోహిత్, కోహ్లీ!

రోహిత్, కోహ్లీ వచ్చే నెల స్వదేశంలో ఇంగ్లండ్తో జరగనున్న వన్డేలు ఆడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తొలుత వీరు రెస్ట్ తీసుకుంటారని వార్తలు రాగా, ఈ సిరీస్ ఆడితే FEB 19న ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీలో రాణించేందుకు కలిసొస్తుందని వీరు భావిస్తున్నట్లు సమాచారం. వెన్నునొప్పితో బాధపడుతున్న బుమ్రా నేరుగా CT ఆడతారని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. FEB 6, 9, 12 తేదీల్లో ఇంగ్లండ్తో భారత్ తలపడనుంది.
Similar News
News November 28, 2025
సచిన్-ద్రవిడ్ రికార్డు బ్రేక్ చేయనున్న రో-కో!

నవంబర్ 30 నుంచి టీమ్ ఇండియా, సౌతాఫ్రికా మధ్య 3వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది. రోహిత్-కోహ్లీ జోడీకున్న క్రేజ్ అందరికీ తెలిసిందే. రాంచీ వేదికగా జరగనున్న తొలి వన్డేలో వీళ్లు చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు. వీళ్లు జోడీగా 391 అంతర్జాతీయ మ్యాచులు ఆడారు. సచిన్-ద్రవిడ్ కూడా సరిగ్గా అన్నే మ్యాచులు కలిసి ఆడారు. రాంచీలో రోహిత్-కోహ్లీ కలిసి క్రీజులో నిల్చుంటే చాలు సచిన్-ద్రవిడ్ రికార్డు బద్దలవుతుంది.
News November 28, 2025
NABARDలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News November 28, 2025
సీఎం రేవంత్ జిల్లాల పర్యటన

TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 1 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. డిసెంబర్ 1న మక్తల్, 2న కొత్తగూడెం, 3న హుస్నాబాద్, 4న ఆదిలాబాద్, 5న నర్సంపేట, 6న దేవరకొండలో పర్యటించనున్నారు.


