News February 22, 2025

పాక్‌పై రోహిత్ 60 బంతుల్లో సెంచరీ: యువరాజ్

image

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ రేపు పాకిస్థాన్‌తో జరిగే మ్యాచులో 60 బంతుల్లోనే సెంచరీ చేస్తారని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అన్నారు. ఫామ్‌లో ఉన్నాడా లేడా అనేది ముఖ్యం కాదని చెప్పారు. వైట్ బాల్ క్రికెట్‌లో కోహ్లీతో పాటు రోహిత్ గొప్ప మ్యాచ్ విన్నర్ అని ప్రశంసించారు. పాకిస్థాన్‌పై 19 వన్డేలు ఆడిన హిట్ మ్యాన్ 51.35 సగటుతో 873 పరుగులు చేశారు. ఇందులో 2 సెంచరీలు, 8 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

Similar News

News February 22, 2025

కర్ణాటకకు బస్ సర్వీసులు నిలిపేసిన మహారాష్ట్ర

image

సరిహద్దు వివాదం నేపథ్యంలో కర్ణాటకకు బస్సు సర్వీసులు నిలిపేస్తున్నట్లు మహారాష్ట్ర ప్రకటించింది. కర్ణాటకలోని బెళగావిలో MSRTCపై KRV (కన్నడ రక్షక వేదిక) ప్రతినిధులు దాడి చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడికి బస్సులను నడపడం మంచిది కాదని పోలీసులు హెచ్చరించడంతో నిలిపేసింది. పోలీసుల క్లియరెన్స్ వచ్చిన తర్వాత బస్సు సర్వీసులను అధికారులు పునరుద్ధరించనున్నారు.

News February 22, 2025

IML T20: నిరాశపర్చిన సచిన్.. స్కోర్ ఎంతంటే?

image

ముంబైలో జరుగుతోన్న ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20-2025లో సచిన్ టెండూల్కర్ నిరాశ పరిచారు. శ్రీలంక మాస్టర్స్ జట్టుపై 8 బంతుల్లో 10 రన్స్ చేసి ఔటయ్యారు. అంబటి రాయుడు 5, గుర్‌కీరత్ సింగ్ మాన్ 44, స్టువర్ట్ బిన్నీ 68, యువరాజ్ 31*, యూసఫ్ పఠాన్ 56* రన్స్ చేశారు. ఇండియా మాస్టర్స్ 20 ఓవర్లలో 222/4 రన్స్ చేసింది.

News February 22, 2025

బంతులా?.. బుల్లెట్లా?

image

ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ CTలో భాగంగా ఇవాళ ఆసీస్‌పై బంతులతో నిప్పులు చెరిగారు. తొలి నాలుగు ఓవర్లలో కేవలం రెండు బంతులే 150Kmph కంటే తక్కువ వేగంతో వేశారు. మిగతా బాల్స్ అన్నీ 150Kmph కంటే వేగంగా సంధించాడు. ఇందులో వేగవంతమైన బంతి స్పీడ్ 153.5Kmph. ఇంతటి వేగంలోనూ చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌లో బాల్స్ వేయడంతో ఆసీస్ బ్యాటర్లు స్కోర్ చేసేందుకు ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలోనే వుడ్ ఓ వికెట్ తీశారు.

error: Content is protected !!