News August 10, 2024
రోహిత్ శర్మ 24 క్యారెట్ల బంగారం: ఆకాశ్ చోప్రా
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_82024/1723283049884-normal-WIFI.webp)
టీమ్ ఇండియా వన్డే/టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసలు కురిపించారు. రోహిత్ చాలా మంచి మనిషంటూ ఆకాశానికెత్తేశారు. ‘ఆటగాడిగానే కాదు, మనిషిగానూ రోహిత్ అద్భుతం. తను మంచివాడు కాదని చెప్పిన ఒక్క వ్యక్తిని కూడా నేను చూడలేదు. 24 క్యారెట్ల బంగారం ఆయన’ అని కొనియాడారు. టీ20ఐ నుంచి రిటైరైన రోహిత్ ప్రస్తుతం వన్డే, టెస్టు ఫార్మాట్లలో మాత్రమే కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
Similar News
News February 6, 2025
రేపు ఒంగోలులో ఆర్జీవీ విచారణ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737611577062_81-normal-WIFI.webp)
AP: సినీ దర్శకుడు రాంగోపాల్వర్మను రేపు ఒంగోలు రూరల్ పీఎస్లో పోలీసులు విచారించనున్నారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారని గతంలో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో విచారణకు రావాలని రెండుసార్లు పోలీసులు నోటీసులిచ్చినా వర్మ హాజరుకాలేదు. తాజాగా ఫిబ్రవరి 4న మరోసారి సమన్లు ఇవ్వగా ఈనెల 7న హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని ఆర్జీవీ కోరారు. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణపై ఉత్కంఠ నెలకొంది.
News February 6, 2025
BREAKING: భారత్ విజయం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738852236716_367-normal-WIFI.webp)
ENGతో జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 249 పరుగుల లక్ష్యాన్ని 38.4 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్లు జైస్వాల్ (15), రోహిత్ (2) వెంటనే ఔటైనా గిల్ (87), అయ్యర్ (59), అక్షర్ పటేల్ (52) రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. రెండో వన్డే ఈనెల 9న కటక్ వేదికగా జరగనుంది.
News February 6, 2025
ఏనుగులూ పగబడతాయ్!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738837413360_746-normal-WIFI.webp)
పాము పగబడుతుందని పెద్దలు చెప్తే విన్నాం. అలాగే ఏనుగులు సైతం తమకు నచ్చని వ్యక్తులపై పగ పెంచుకుంటాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ‘ఎవరైనా తమకు నష్టం కలిగిస్తే ఏనుగులు వారిని గుర్తు పెట్టుకుంటాయి. ఎంతమందిలో ఉన్నా వారిని గుర్తించి దాడి చేస్తాయి. ఇలాంటి ఘటనే ఇటీవల చిత్తూరులో జరిగింది. అటవీ శాఖకు చెందిన ఓ వ్యక్తి ఏనుగుతో మిస్ బిహేవ్ చేయడంతో 20 మందిలో ఉన్నా అతణ్నే చంపేసింది’ అని చెప్పారు.