News July 17, 2024

శ్రీలంకతో వన్డే సిరీస్‌‌‌లోకి రోహిత్ శర్మ?

image

శ్రీలంకతో వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మ అందుబాటులో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికా వెకేషన్‌‌కు వెళ్లిన రోహిత్.. ఈ సిరీస్‌ కోసం తిరిగి రావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. జట్టు కూర్పుపై సెలక్షన్ కమిటీకి హెడ్ కోచ్ గంభీర్ క్లారిటీ ఇచ్చినట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఒకవేళ రోహిత్ టీమ్‌లోకి వస్తే ఆయనే కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. లేదంటే కేఎల్ రాహుల్‌‌కు బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉంది.

Similar News

News December 24, 2025

BELలో అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తుకు రేపే ఆఖరు తేదీ

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (<>BEL<<>>) ఘజియాబాద్‌లో 84 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. బీటెక్, BE ఉత్తీర్ణులైన వారు NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 25ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి నెలకు స్టైపెండ్ రూ.17,500 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://bel-india.in

News December 24, 2025

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. నిఫ్టీ 32 పాయింట్ల లాభంతో 26,210 వద్ద.. సెన్సెక్స్ 89 పాయింట్లు పెరిగి 85,611 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్‌ఫైనాన్స్, NTPC, బజాజ్ ఫిన్‌సర్వ్, యాక్సిస్‌బ్యాంక్ షేర్లు లాభాల్లో.. టెక్‌మహీంద్రా, ఇన్ఫీ, TMPV, సన్‌ఫార్మా, HCL టెక్ నష్టాల్లో ఉన్నాయి.

News December 24, 2025

విత్తనాలు కొనేటప్పుడు రశీదు కీలకం

image

విత్తన రకం, లాట్ నంబర్, గడువు తేదీ తదితర వివరాలను సరిచూసుకొని విత్తనాలను కొనాలి. విత్తనాన్ని కొనుగోలు చేసిన తర్వాత అధీకృత డీలర్ నుంచి కొనుగోలు రశీదు తప్పకుండా తీసుకోవాలి. దీనిపై రైతు మరియు డీలర్ సంతకం తప్పకుండా ఉండాలి. పంటకు విత్తనం వల్ల నష్టం జరిగితే రైతుకు విత్తన కొనుగోలు రశీదే కీలక ఆధారం. అందుకే ఆ రశీదును పంటకాలం పూర్తయ్యేవరకు జాగ్రత్తగా ఉంచాలి. పూత, కాత రాకపోతే నష్టపరిహారానికి రశీదు అవసరం.