News December 12, 2024
రోహిత్ శర్మ టెస్టులకు పనికిరాడు: మాజీ క్రికెటర్

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్వదేశంలో హీరో, విదేశాల్లో జీరో అని సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డారిల్ కల్లినన్ ఎద్దేవా చేశారు. ఫ్లాట్ ట్రాక్లపై మాత్రమే ఆయన ఆడతారన్నారు. ‘రోహిత్ ఫిట్గా కనిపించడం లేదు. కోహ్లీ ఫిట్నెస్తో పోలిస్తే హిట్మ్యాన్ చాలా వెనుకబడ్డారు. ఆయన అధిక బరువుతో సతమతమవుతున్నారు. 5 రోజుల పాటు సాగే టెస్టుల్లో ఆడేందుకు రోహిత్ పనికిరాడు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News November 6, 2025
రెండో రోజూ ఏసీబీ సోదాలు

AP: రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజూ ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 12 కార్యాలయాల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. డబుల్ రిజిస్ట్రేషన్లు, డాక్యుమెంట్ల ట్యాంపర్లో ప్రైవేటు వ్యక్తుల పాత్ర ఉందని తెలుస్తోంది. లెక్కల్లో చూపని నగదును పెద్దమొత్తంలో అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
News November 6, 2025
రూ.5వేల కోట్లు ఇచ్చేవరకు కాలేజీల బంద్: ఫతి

TG: రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఫార్మసీ తదితర ప్రొఫెషనల్ కాలేజీలు మూతబడి 4 రోజులు అవుతోంది. రూ.10వేల కోట్ల రీయింబర్స్మెంట్ బకాయిల్లో రూ.5వేల కోట్లు విడుదల చేసే వరకు బంద్ కొనసాగుతుందని ‘ఫతి’ స్పష్టం చేసింది. మిగతా రూ.5వేల కోట్లలో నెలకు రూ.500 కోట్ల చొప్పున 10 నెలల్లో విడుదల చేయాలంది. అధ్యాపకులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నామని.. అందుకే బంద్కు దిగాల్సి వచ్చిందని పేర్కొంది.
News November 6, 2025
ఏ దిక్కున కూర్చొని భోజనం చేయాలి ?

ఆయుష్షు కోరుకునేవారు తూర్పు ముఖంగా, కీర్తి, పేరు ప్రఖ్యాతలు కోరుకునేవారు దక్షిణ ముఖంగా కూర్చుని భోజనం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. తూర్పు దిశ నుంచి ప్రాణ, సానుకూల శక్తి వస్తుంది. ఈ శక్తి భోజనం చేసేటప్పుడు శరీరంలోకి ప్రవహించి, జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఆహారం ఆయురారోగ్యాలను ఇవ్వడానికి, ఉత్తమ ఫలితాలను పొందడానికి ఈ నియమాలు పాటించాలి. భోజనం చేసేటప్పుడు పద్మాసనంలో కూర్చోవడం, మౌనం పాటించడం మంచిది.


