News March 14, 2025
ఫ్యామిలీతో కలిసి రోహిత్ శర్మ మాల్దీవుల విహారం

టీమ్ ఇండియాకు ఛాంపియన్స్ ట్రోఫీ తెచ్చిపెట్టిన కెప్టెన్ రోహిత్ శర్మ ఆ టోర్నీ అనంతరం ఫ్యామిలీతో కలిసి విహారయాత్రలో గడుపుతున్నారు. భార్యాబిడ్డలతో కలిసి మాల్దీవులకు వెళ్లారు. దానికి సంబంధించి ఆయన ఇన్స్టాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. వచ్చే 2 నెలల పాటు ఐపీఎల్తో తీరిక లేని షెడ్యూల్లో ఉండనున్న నేపథ్యంలో ఆయన ఈ బ్రేక్ తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండు మూడురోజుల్లో ఆయన ముంబై జట్టుతో కలవనున్నారు.
Similar News
News October 28, 2025
ఇంటర్వ్యూతోనే NIRDPRలో ఉద్యోగాలు..

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ (NIRDPR) 9పోస్టులను ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయనుంది. వీటిలో సీనియర్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్, రీసెర్చ్ అసోసియేట్ పోస్టులు ఉన్నాయి. బీఈ, బీటెక్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఎర్త్& ఎన్విరాన్మెంటల్ సైన్స్, జియో ఇన్ఫర్మాటిక్స్, పీహెచ్డీతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 29న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. వెబ్సైట్: http://career.nirdpr.in
News October 28, 2025
రోజూ ఇలా చేస్తే ప్రశాంతంగా నిద్ర పడుతుంది: వైద్యులు

నిద్ర నాణ్యతను మెరుగుపరుచుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్యులు సూచిస్తున్నారు. ‘రోజూ నిద్రపోయే సమయాన్ని ఫిక్స్ చేసుకోండి. వారాంతాల్లోనూ ఒకే సమయానికి పడుకుని, మేల్కొంటే శరీరం ఒకే దినచర్యకు అలవాటు పడుతుంది. పడుకునే 30-60 నిమిషాల ముందు టీవీలు, ల్యాప్టాప్స్కు దూరంగా ఉండాలి. దీనికి బదులు పుస్తకాలు చదవండి. గదిని చల్లగా, చీకటిగా, నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోండి’ అని చెబుతున్నారు.
News October 28, 2025
ప్లాస్టిక్ మల్చింగ్ వల్ల లాభమేంటి?

కలుపు నివారణలో మల్చింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. ప్లాస్టిక్ షీటును మొక్క చుట్టూ నేలపై కప్పడాన్ని ప్లాస్టిక్ మల్చింగ్ అంటారు. ప్లాస్టిక్ మల్చింగ్ వల్ల నేల తేమను నిలుపుకుంటుంది. కలుపు కట్టడి జరుగుతుంది. పంట ఏపుగా పెరిగి దిగుబడి బాగుంటుంది. కూరగాయల సాగుకు ఇది అనుకూలం. మల్చింగ్ చేసిన ప్రాంతంలో పంటకాలం పూర్తయ్యాక దున్నాల్సిన అవసరం లేకుండా పాత మొక్కలను తీసేసి వాటి స్థానంలో కొత్త మొక్కలను నాటుకోవచ్చు.


