News January 17, 2025
రేపు మధ్యాహ్నం రోహిత్ శర్మ ప్రెస్ మీట్

భారత కెప్టెన్ రోహిత్ శర్మ రేపు మ.12.30 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ముంబై వాంఖడే స్టేడియం వద్ద చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్తో కలిసి మీడియాతో మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా ఛాంపియన్స్ ట్రోఫీ టీమ్ను ప్రకటిస్తారు. అలాగే కొన్ని రోజులుగా డ్రెస్సింగ్ రూమ్లో వివాదాలంటూ వస్తున్న వార్తలపై స్పందించే అవకాశం ఉంది. కోచ్ గంభీర్ పాల్గొనే విషయంపై క్లారిటీ లేదు. స్టార్ స్పోర్ట్స్, హాట్స్టార్లో లైవ్.
Similar News
News December 8, 2025
భారత్కు గుడ్న్యూస్.. గిల్ ఎంట్రీ పక్కా!

మెడ నొప్పి వల్ల SAతో టెస్టులు, వన్డేలకు దూరమైన గిల్ T20లతో తిరిగి జట్టులో చేరేందుకు రెడీ అయ్యారు. రేపట్నుంచి SAతో 5మ్యాచుల T20 సిరీస్ ప్రారంభం కానుండగా ఆదివారం రాత్రి భువనేశ్వర్ చేరుకున్నారు. BCCI CoEలో గిల్ ఫిట్నెస్ సాధించినట్లు క్రిక్బజ్ తెలిపింది. విశాఖలో చివరి వన్డే తర్వాత గంభీర్ కూడా దీన్ని ధ్రువీకరించగా గిల్ ఎంట్రీ పక్కా కానుంది. హార్దిక్ సైతం రీఎంట్రీ ఇస్తుండటంతో జట్టు బలం పెరిగింది.
News December 8, 2025
పాడి రైతులు ఈ విషయం గుర్తుంచుకోవాలి

రోజుకు రెండు లీటర్లు పాలిచ్చే 5 ఆవులను పోషించే బదులు.. రోజుకు 10 లీటర్లు పాలిచ్చే ఒక సంకరజాతి ఆవును పోషించడం ఎంతో లాభసాటిగా ఉంటుందని వెటర్నరీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాడి పశువుల పోషణ వ్యయంలో 60 నుంచి 70 శాతం వ్యయం దాణా, గడ్డి, మందులకే ఖర్చవుతుంది. పాడి పరిశ్రమను లాభసాటిగా సాగించాలంటే పాడి పశువుల మేపుపై అదుపు, సంకరజాతి పశువుల పోషణపై సరైన అవగాహన కలిగి ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
News December 8, 2025
టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును విద్యాశాఖ పొడిగించింది. గతంలో ఈ నెల 15వ తేదీ వరకు రుసుంతో చెల్లించవచ్చని చెప్పగా, తాజాగా 18వ తేదీ వరకు గడువు పెంచింది. అలాగే ఫైన్ లేకుండా ఈ నెల 9వ తేదీ వరకు, రూ.50 ఫైన్తో 12 వరకు, రూ.200 ఫైన్తో ఈ నెల 15 వరకు, రూ.500 ఫైన్తో ఈ నెల 18వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.


