News January 15, 2025

రోహిత్ పాకిస్థాన్‌కు వెళ్తాడు: బీసీసీఐ వర్గాలు

image

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కెప్టెన్స్ ఫొటో షూట్, ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాక్‌కు వెళ్తారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. 29 ఏళ్ల తర్వాత పాక్ ఐసీసీ టోర్నీ నిర్వహిస్తోందని పేర్కొన్నాయి. ఒకవేళ హిట్ మ్యాన్ నిజంగానే పాక్‌కు వెళ్తే ఆయన అక్కడికి వెళ్లడం ఇదే తొలిసారి అవుతుంది. ఫిబ్రవరి 19న ఈ టోర్నీ ప్రారంభం కానుండగా, భారత్VSపాక్ మ్యాచ్ 23న దుబాయిలో జరగనుంది.

Similar News

News December 2, 2025

‘కోహ్లీ’ దిగ్గజాలను దాటేశారు: ఫ్యాన్స్

image

SAపై తాజా సెంచరీతో వన్డేల్లో కోహ్లీ 52 సెంచరీలు చేసి ఓ ఫార్మాట్లో అత్యధిక శతకాలు బాదిన ప్లేయర్‌గా నిలిచారు. అయితే సెంచరీల్లో దిగ్గజ ప్లేయర్లను విరాట్‌ ఎప్పుడో దాటేశారని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కోహ్లీ వన్డేల్లో 294 ఇన్నింగ్స్ ఆడారని, ఇదే సంఖ్యలో ఆడిన తర్వాత సచిన్ సెంచరీలు 33 అని, పాంటింగ్ 26, గేల్ 25 శతకాలు బాదారని పోస్టులు పెడుతున్నారు. బ్యాటింగ్ AVG కూడా కోహ్లీ(58)దే ఎక్కువ అని చెబుతున్నారు.

News December 2, 2025

ఫోన్లలో Govt యాప్.. నిఘా కోసమేనా?

image

ఫోన్లలో ప్రభుత్వ ‘సంచార్ సాథీ’ యాప్‌ <<18439451>>డిఫాల్ట్‌గా<<>> ఉండాలన్న కేంద్రం నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నేరాలకు అడ్డుకట్ట వేసే పేరుతో ప్రజలపై నిఘా పెట్టాలనుకుంటున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రష్యా, నార్త్ కొరియా వంటి దేశాల్లోనే డిలీట్ చేసేందుకు వీలులేని ఇలాంటి యాప్స్ ఉన్నాయని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నార్త్ కొరియాలా తమపై నిఘా పెడతారా అని ప్రశ్నిస్తున్నారు. మీ కామెంట్?

News December 2, 2025

విష్ణు నామాల్లోనే ఆయన గొప్పతనం

image

అప్రమేయో హృషీకేశః పద్మనాభో మరప్రభుః|
విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠః స్థివిరో ధ్రువః||
కొలవలేనంత గొప్పతనం కలిగిన అప్రమేయుడు, మనస్సుకు అధిపతి అయిన హృషీకేశుడు, దేవతలకు రాజైన సురప్రభువు, సృష్టిని నిర్మించిన విశ్వకర్మ, మన పాలకుడైన మనువు, రూపాలను తీర్చిదిద్దే త్వష్టా, అతి స్థిరమైన స్థవిష్ఠుడు, ధ్రువుడు, అతి పెద్దవాడైన స్థవిరుడు, నాభి నుంచి పద్మం కలిగిన పద్మనాభుడు ఆ విష్ణుమూర్తే. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>