News March 17, 2024

కోహ్లీకి రోహిత్ మద్దతు?

image

T20WCలో చోటుపై విరాట్ కోహ్లీకి.. కెప్టెన్ రోహిత్ శర్మ మద్దతు పలికినట్లు తెలుస్తోంది. జూన్‌లో జరగనున్న ఈ మెగా టోర్నీకి అతడు భారత జట్టులో ఉండాల్సిందేనని హిట్‌మ్యాన్ బీసీసీఐ పెద్దలతో చెప్పినట్లు సమాచారం. పలువురు సెలక్టర్లు మూడో స్థానంలో ఇషాన్‌ను ఆడించాలని యోచిస్తుండగా రోహిత్ మాత్రం కోహ్లీ వైపు మొగ్గు చూపుతున్నారట. వరల్డ్ కప్‌లో విరాట్ స్థానంపై త్వరలోనే సెలక్టర్లు అఫీషియల్ ప్రకటన చేసే అవకాశం ఉంది.

Similar News

News January 5, 2026

విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం: పార్థసారథి

image

AP: రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు. అధికారంలోకి వస్తే ఛార్జీలు పెంచబోమనే హామీకి కట్టుబడి ఉన్నామన్నారు. సోలార్, విండ్, బయో విద్యుత్ రంగాల్లో 80గిగావాట్ల విద్యుత్‌ను తక్కువ ధరకు కొనే విధంగా అగ్రిమెంట్ చేసుకుంటున్నట్లు చెప్పారు. సూర్యఘర్ పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు కంప్లీట్ సబ్సిడీ.. బీసీలకు అదనంగా రూ.50వేల రాయితీ ఇస్తున్నట్లు మంత్రి వివరించారు.

News January 5, 2026

శివ మానస పూజ ఎలా చేయాలి?

image

శివ మానస పూజ అంటే ఏ పూజా సామాగ్రి లేకుండా మనసులోనే పరమశివుడిని ఆరాధించడం. అందుకోసం ప్రశాంతమైన చోట కూర్చుని కళ్లు మూసుకోవాలి. హృదయమే రత్న సింహాసనమని, ఆత్మయే శివుడని భావించాలి. మనసులోనే గంగాజలంతో అభిషేకం, కల్పవృక్ష పుష్పాలతో అలంకరణ, ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. పంచేంద్రియాలను శివుడికి అంకితం చేయాలి. ఈ మానసిక అర్చన అత్యంత శక్తిమంతమైనది. భౌతిక పూజా ద్రవ్యాలు అందుబాటులో లేకపోతే ఈ పూజను ఆచరించవచ్చు.

News January 5, 2026

కాండం తొలిచే పురుగుతో వరికి నష్టం ఎక్కువే..

image

కాండం తొలిచే పురుగు వరి నారుమడి నుంచి పంట ఈనె దశ వరకు ఆశించి నష్టం కలిగిస్తుంది. నారుమడి దశలో ఈ పురుగు మొక్క మువ్వలోకి రంద్రాలు చేసుకొని చొచ్చుకెళ్లి తినడం వల్ల మువ్వ గోధుమ రంగులోకి మారి మెలికలు తిరిగి ఎండి, మొక్కలు అధికంగా చనిపోతాయి. కాండం భాగాన్ని ఈ పురుగు తింటే మొక్కకు సరిపడ పోషకాలు అందక తెల్లకంకిగా మారి తాలు గింజలు ఏర్పడతాయి. కాండం తొలుచు పురుగు పంట నాణ్యత, దిగుబడిని ప్రభావితం చేస్తుంది.